మధ్య ప్రదేశ్ వ్యాపం స్కాంలో మరణాలు ఆగడంలేదు. 48 గంటల్లో ఓ విలేకరి, వైద్యుడు మరో ట్రైనీ సబ్ఇన్స్పెక్టర్ మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ శింగ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ తన దాడిని తీవ్రం చేసింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న వారంతా వరసగా మరణిస్తుంటే తనకు ఏం తెలియనట్టు,సీఎం, ప్రధాన మంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ స్కాంను సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
Also Read: సీఎం చౌహాన్ కూడా వ్యాపం కుంభకోణంలో దోషే
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. కేసును హైకోర్టు పరిశీలిస్తున్నా అనుమానాస్పద మరణాలు ఆగడంలేదని అందుకే సుప్రీం కోర్టు కలగజేస్కోవాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి గత 48 గంటల్లో ముగ్గురు అనుమానాస్పదంగా మరణించారు. ఇప్పటికే విలేకరి అక్షయ్ సింగ్, మరో వైద్యుడు మరణించగా తాజా ఓ మహిళా ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ మృతదేహం పోలీస్ ట్రైనింగ్ అకడామీ దగ్గర కనిపించింది. మరోవైపు ఈకేసును పరిశీలిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పాట్నా మెడికల్ కాలేజ్ చేరుకొని విచారణ చేపట్టింది.
దీంతో ఈ కేసు గురించి బైటపెట్టిన అశిష్ చతుర్వేది తనకు ప్రాణ భయం ఉందని.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఈ కేసుతో సంబంధముందని చెప్పి సంచలన సృష్టించాడు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు చౌహాన్. ఈ మరణాలకు, వ్యాపం కేసుకు సంబంధంలేదని సీఎం చౌహాన్ తెలిపారు. అయితే వ్యాపం వ్యవహారంపై తనక్కూడా ప్రాణ భయం ఉంది అని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. కాగా ఓ నిందితుడు చెప్పిన దాని ఆధారంగా తన పేరును కేసులో చేర్చడం తనకు దిగ్ర్భాంతిని కలిగించిందని ఉమాభారత పేర్కొంది.
Also Read: వ్యాపమ్ స్కాంలో కలకలం రేపుతున్న వరుస అనుమానాస్పద మరణాలు..
వరుస మరణాలతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న వ్యాపమ్ స్కామ్పై సుప్రీంకోర్టు స్పందించింది.ఈ కుంభకోణానికి సంబంధించి దాఖలైన 9 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.ఈ స్కామ్సై సీబీఐ విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ దిగ్విజయ్, కుమార్ విశ్వాస్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై స్పందించిన కోర్టు ఈ నెల 9న విచారణ జరుపుతామని వెల్లడించింది.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more