రేవంత్ రెడ్డి ఎలాగోలా బయటకు వచ్చాడు కదా అని అనుకుంటున్నారో అప్పుడే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఏసీబీ అధికారులు అరెస్టు చెయ్యడం టిడిపి నాయకులను కలవరపెడుతోంది. ఉదయం నుండి విచారణ ప్రారంభించిన తెలంగాణ ఏసీబీ అధికారులు సాయంత్రం పూట సండ్రను అరెస్టు చేశారు. సండ్ర అరెస్టయిన వెంటనే పార్టీ నేతలు, మంత్రులు జపాన్ టూర్లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు విషయాన్ని చేరవేశారు. అప్పటినుంచి చంద్రబాబు తాజా పరిస్థితులపై ఏపీ పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్, వీడియో కాలింగ్లో ఆరా తీసినట్లు తెలిసింది. ప్రతి అర్ధగంటకూ ఏపీ డీజీపీ రాముడును లైన్లోకి తీసుకుని ఎలా ముందడుగు వేయాలి..? ఇంకా తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఎవరెవరికి ఇచ్చే అవకాశాలున్నాయి.. అంటూ ఆరా తీసినట్లు సమాచారం.
Also Read: ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు
ఇప్పటికే ఏపీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని తీరు బాగోలేదని ఆగ్రహించిన చంద్రబాబు అనురాధను పక్కనపెట్టి కొత్త చీఫ్ను నియమించిన రోజే మరో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. దీంతో మనిషి జపాన్లో ఉన్నప్పటికీ మనసు హైదరాబాద్లో అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. ఇంటెలిజెన్స్ నూతన చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావుతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది. ఇక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియోను పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు దానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆడియోలోని గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ విభాగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అయితే దానిని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలంటే, చంద్రబాబు వాయిస్ తీసుకుని, ఆడియోలో ఉన్న వాయిస్ను సరిపోల్చాల్సి ఉంటుంది. అప్పుడు చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ సిద్ధపడుతుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
Also Read: ఏసీబీ రమ్మంటే అనారోగ్యం అంటున్న సండ్ర
సండ్ర అరెస్ట్తో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలలో ఉన్న టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇక పార్టీలో ఉండలేమనే భావనను వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపీ నాయకులెవరూ సండ్ర అరెస్టుపై స్పందించకపోవడం వారిలో అభద్రతాభావాన్ని తెలియజేస్తున్నది. అంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు, మంత్రులు కూడా సండ్ర అరెస్టు విషయమై నోరు విప్పడం లేదు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఏపీ సచివాలయంలో మంత్రులు మీడియాకు అందుబాటులో లేకుండా జాగ్రత్తపడ్డారు. సండ్ర అరెస్టు వార్తను తెలుసుకున్న మంత్రులు ఎవరి కంటపడకుండా ఇళ్లకు వెళ్లిపోయారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ అంశంలో డీజి అనురాధపై బదిలీ వేటు
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more