ఆధార్ కార్డులు పొందేందుకు మనుషులే ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వాధికారులు కుక్కలకు మాత్రం ఈజీగా ఆధార్ కార్డు జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు జారీ ప్రక్రియలో లోటుపాట్లను తెలిపుతూ ఇప్పటికే ఒకొక్కరు ఒక్కొ రక్కంగా వెలుగులోకి తీసుకోచ్చారు. అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం గతంలో హనుమంతుడికి ఆధార్ కార్డు జారీ చేసిన అధికారులు నాలుక కర్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ శునకానికి ఆధార్ కార్డును జారీ చేశారు. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండి.. మధ్యప్రదేశ్లో ఓ కుక్కకు ఆధార్ కార్డు వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లాలో అజంఖాన్ అనే వ్యక్తి తన కుక్కకు టామీ సింగ్ పేరుతో ఆధార్ కార్డు తీసుకున్నాడు. కార్డులో కుక్క ఫోటో, టామీ సింగ్ అనే పేరు.. సన్ ఆఫ్ షేరు సింగ్ అని ఉంది. అంతేకాకుండా.. ఇక నవంబర్ 26, 2009లో ఆ కుక్క పుట్టినట్లు ఆధార్ కార్డులో ఉంది.
విషయం తెలుసుకున్న స్థానికులు.. అధికారులపై విమర్శలు, ఆరోఫణలు గుప్పించడంతో.. వారి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అజం ఖాన్ను అరెస్ట్ చేశారు. జంతువులు, అనధికార వ్యక్తులకు కూడా ఆధార్ కార్డులు తయారు చేయిస్తున్నాడనే కోణంలో విచారణ సాగిస్తున్న పోలీసులు అతనిపై ఫోర్జరీ కేసును నమోదు చేశారు. అయితే వాస్తవానికి అజంఖాన్ ఉమ్రి అనే ప్రాంతంలో ఉన్న ఆధార్ ఎన్ రోల్మెంట్ ఏజెన్సీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడట. ఈ క్రమంలో కుక్కలు, ఇతర జంతవులకు ఖాన్ ఏజెన్సీ కార్డులు తయారు చేస్తున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో హనుమంతుడికి ఆధార్ కార్డు రావడానికి కూడా కారణముంది. తాను అనేక పర్యాయాలు దరఖ్యాస్తు చేసుకున్నా.. ఎంతకీ అధికారులు తనకు ఆధార్ కార్డును జారీ చేయకపోవడంతో.. విసుగు చెందిన ఓ వ్యక్తి హనుమంతుడి ఫోటో పెట్టి పవన్ జీ పేరున ఆధార్ కార్డు సంపాదించిన విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more