ఇప్పటికీ డ్రీమ్ గాళ్ అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే నటి హేమామాలిని. ప్రస్తుతం అమె మదుర నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహి్తున్నారు. రాజకీయ నాయకురాలిగా మారిన నటి నిన్న ప్రమాదానికి గురికావడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. హేమామాలిని పట్ల సానుభూతిని వ్యక్తం చేయడమేంటని పలువురు అమెను దుమ్మెత్తిపోస్తున్నారు. అమె ఏకంగా లేడి సల్మాన్ ఖాన్ లా వ్యవహరించారని విమర్శలు గుప్పిస్తున్నారు నెట్ జనులు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ కు 55 కిలోమీటర్ల దూరంలోని దౌసా జిల్లాలో అమె ప్రయాణిస్తున్న కారు.. ముందుగా వెళ్తున్న అల్టో కారును ఢీకొని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన హేమమాలిని కారు కారణంగానే అల్టో కారులోని నాలుగేళ్ల చిన్నారి, అరేళ్ల బాలుడి రెండు కాళ్లు దెబ్బతింటే వారి పట్ల సానుభూతి చూపించాల్సిందిపోయి.. ప్రభుత్వం.. మీడియా హేమామాలిని పట్ల సానుభూతి ఎదుకు చేసిస్తున్నారని నెట్ జనులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. తన కారు ఢీ కోనసడం వల్ల క్షతగాత్రులైన వారిని, అసువులు బాసిన వారిని అస్పత్రికి తరలించాల్సింది పోయి.. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ మాదరిగా ప్రవర్తించడానికి, ఈ ఘటనకు పెద్ద తేడా ఏమిటని నెట్ జనులు నిలదీస్తున్నారు.
ప్రజా సేవకులమని చెప్పుకునే ప్రజా ప్రతినిధులను జైపూర్ లోని ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి.. అమె వల్ల గాయాలపాలైన వారిని మాత్రం ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తారా..? ఇదేనా ప్రజాస్వామ్యం..? ఇక్కడ సామాన్య ప్రజల పట్ల ఇదేనా వివక్ష..? సామాన్యులను కనీసం ఓదార్చిన వారు కూడా ప్రజాస్వామ్యంలో కరువయ్యారా..? అంటూ నెట్ జనులు విమర్శలను గుప్పిస్తున్నారు. అంతేకాదు ప్రమాదానికి గల కారణాలపై కూడా నెట్ జనులు విశ్లేషణపూర్వకంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా సంభవించిందో మాత్రం కారు డ్రైవర్ కే తెలియాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more