చెన్నైలో వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన తమిళనాడు ప్రభుత్వానికి 17 రెట్లు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే… 1996లో జన్మించిన ఓ బాలిక కంటి చూపు సరిగా లేదన్న కారణంతో తల్లిదండ్రులు ఆమెను ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి కంటి పరీక్షలు నిర్వహించారు. బాలికకు కంటి చూపు వస్తుందని అక్కడి వైద్యులు పరీక్షల అనంతరం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రీ మెచ్యూరిటీ రెటినోపతి శస్త్ర చికిత్స జరిపారు. ఈ ఆపరేషన్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ బాలికకు కంటి చూపు పూర్తిగా పోయింది.
వైద్యులు నిర్లక్షంగా వ్యవహరించి.. శస్త్ర చికిత్స చేయడంతో తమ కూతురికి అప్పటి వరకు మసక మసకగా కనబడిన చూసు కాస్తా పూర్తిగా పోయిందని ఆరోపిస్తూ..ఆ బాలిక తండ్రి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశించిన న్యాయస్థానం ఇరువైపులా వాదనలను విచారించింది. ఆ తరువాత వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అభిప్రాయానాకి వచ్చిన న్యాయస్థానం.. భాధితురాలికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆస్పత్రిని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.
అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆ బాలికకు నష్ట పరిహారంగా 1.3 కోట్లు.. వైద్య ఖర్చులకైన మొత్తం 42.8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ బాలిక వయస్సు 18 సంవత్సరాలు. మొత్తం ఆ యువతికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు పరిహారం, వైద్య ఖర్చుల కింద కోటీ 72 లక్షల 80 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అందుకే పెద్దలు అంటారు.. పోరాడితే పోయేదేమీ లేదని.. ఇప్పటికైనా బోధపడిందా..!
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more