తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు సృష్టించారు. అక్రమాస్థులు కూడబెట్టుకున్నారన్న ఆబియోగాల నేపథ్యంలో అమె రాజీనామా చేసిన ఎమ్మెల్యే స్థానానికి కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతో జరిగిన అర్కే నగర్ ఉప ఎన్నికలలో మునుపెన్నడూ లేణి భారీ మోజారిటీతో అమ్మ రికార్డు సృష్టించారు. జయలలిత తన ప్రత్యర్థులపై ఏకంగా లక్షా యాబై రెండు వేల 46 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ఆమె ప్రత్యర్థుల మీద మెజారిటితో ముందుకు దూసుకు వెళ్లారు. 15వ రౌండ్ నుండి 17వ రౌండ్ వరకు జయలలిత ఏకపక్షంగా మెజారిటి సాధించారు. సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు కేవలం 8,875 ఓట్లు వచ్చాయి. జయయలిత గెలుపుతో తమిళనాడులో ఆమె అభిమానులు పార్టీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు.
నియోజకవర్గంలో నమోదైన 74.4 శాతం ఓట్లలో సుమారుగా 90 శాతం మంది ప్రజలు జయలలిత అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. జయలలితకు మొత్తంగా 1, 60, 921 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి సిసిఐ పార్టీకి చెందిన మహేంద్రన్ కు 8875 ఒట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా ఈ ఎన్నికల బరిలో నిలిచిన 27 మంది అభ్యర్థులు తమ ధరావత్తును కోల్పోయారు. జయలలిత అధిక్యం దేశంలోనే ఒక రికార్డుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ అధినేత్రి కడిగిన ముత్యమని నియోజకవర్గ ప్రజలు అమెను భారత అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తిరుగులేని రికార్డు విజయాన్ని అందించారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జయలలిత విజయంతో చైన్నైలో కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
గతంతో ఎపిలోని తిరుపతిలో టిడిపి అభ్యర్ధి సుమారు లక్షా పాతికవేల ఆధిక్యతతో గెలుపొందారు.ఇప్పుడు చెన్నైలోని ఆర్.కె.నగర్ నియోజకవర్గం నుంచి జయలలిత ఆ రికార్డును అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.ఈ ఉప ఎన్నిక పలితం భవిష్యత్తులో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంకేతం అని అన్నా డి.ఎమ్.కె. పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి. కాగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అయిన డి.ఎమ్.కె. పోటీలో లేదు.తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యమంత్రి జయలలితకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more