ఓటుకు నోటు కేసులో రిమాండ్ ను ఎదుర్కొంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు కాకుండా ఏసీబీ, తెలంగాణ అడ్వకేట్ జనరల్ చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా పని చెయ్యలేదు. గతంలో రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసి నిరాశ చెందినా.. మూడో సారి మాత్రం బెయిల్ సాధించారు రేవంత్ రెడ్డి. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని రేవంత్ కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందని అందరికి తెలుసు. రాజకీయ కక్షసాధింపుగానే ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరికించారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని కొట్టివేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి బయటకు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: మీసం మెలేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు వార్నింగ్
రేవంత్ రెడ్డికి బెయిల్ వార్త విన్న తర్వాత అతని భార్య గీతారెడ్డి స్పందించారు. తన భర్తకు బెయిల్ దొరకడం ఎంతో సంతోషంగా ఉంది ఆమె తెలిపారు. అయితే తన తండ్రికి బెయిల్ వచ్చిన వార్త వినగానే రేవంత్ కూతురు నైమిషా రెడ్డి ఆనందంలో ఏడ్చేసింది. తల్లి గీతారెడ్డిని పట్టుకొని ఏడ్చేసింది. అయితే రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఏవైనా ఇబ్బందులు కలుగుతాయని అనుకున్నానని, కానీ ఇలా .జరుగతుందని అనుకోలేదని అన్నారు. అలాగే తమ కుటుంబానికి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, పార్టీ శ్రేణులకు గీతారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదలైన తర్వాత దూకుడు మాత్రం తగ్గదని అంటున్నారు గీతారెడ్డి. గతంలో మాదిరిగానే సమస్యల మీద దూకుడుగానే దూసుకెళతారని అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంపై రేవంత్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నారు. రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ లో పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
Also Read: తెలంగాణ పులి బిడ్డ రేవంత్ రెడ్డి
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more