నిన్నటివరకు హుషారుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ జోరుగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈరోజు (30-06-2015) మాత్రం బిస్తరేసేశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న అన్ని కార్యకలాపాల్ని నిర్వహించుకోవాలని భావించారు కానీ.. అవన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. దీంతో అటు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఆందోళనల్లో వున్నట్లు తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది..? కేసీఆర్ బిస్తరేయడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా!
అసలు విషయం ఏమిటంటే.. ఈరోజు ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంగా బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో.. గతంలో ఆయన ఇచ్చిన అపాయింటుమెంట్లన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటూ విశ్రాంతిలో వున్నారని వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందుకు ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా కేసీఆర్ రెస్ట్ తీసుకోకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈయన ఒక్కసారిగా జ్వరం బారిన పడటంతో టీఆర్ఎస్ మంత్రులు ఆందోళనల్లో మునిగినట్లు సమాచారం!
కాగా.. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుకు కేసీఆర్ హాజరు కావాల్సి వుంది. అయితే.. ఆయన జ్వరం బారిన పడటంతో అన్ని అపాయింటుమెంట్లన్నీ రద్దు చేసేశారు కాబట్టి.. కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారా? ఆ విందుకు హాజరవుతారా? లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. అయితే.. ఆయన ఆ విందుకు చాలావరకు హాజరయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more