ఫ్రిజ్ లో ఎవరైనా పండ్లు, కూరగాయలు వగైరా పెట్టుకుంటారు. కానీ ఓ మహాతల్లి మాత్రం ఏకంగా భర్త శవాన్ని ఫ్రిజ్ లో దాచుంచింది. అది కూడా మామూలుగా కాకుండా భర్త శవాన్ని భాగాలుగా విడగొట్టి మరీ ఫ్రిజ్ లో ఇరికించింది. అంతలా కసి పెంచుకోవడానికి కారణం ఏంటా అనుకుంటున్నారా..? తన భర్త అక్రమ సంబందానికి అడ్డుపడుతున్నాడని ఏకంగా హతమార్చింది మహా ఇల్లాలు. తమిళనాడు రాష్ట్రంలోపి సేలం అమ్మా పాళయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లిగా ఉంటూ కూడా భర్తతో కాకుండా వేరే వ్యక్తితో సంబందం పెట్టుకొని చివరకు తన భర్తను చంపిన కూనీగా మారింది.
తమిళనాడు రాష్ట్రం సేలం అమ్మా పాళయంలో బాలకృష్ణన్ అనే వ్యక్తి, తన బార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. సెలూన్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బాలకృష్ణన్ భార్య సుందరి ఇంటి ఓనర్ కొడుకు లోక్ నాథన్ తో అక్రమ సంబందం పెట్టుకుంది. అయితే సుందరి, లోక్ నాధన్ ల వ్యవహారం బాలకృష్ణన్ కు తెలియడంతో భార్యను మందలించారు. ఇంకో సారి ఇలాంటి తప్పు చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. అయితే బాలకృష్ణన్ తన వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడని బావించిన సుందరి బాలకృష్ణన్ ను అంతమొందించడానికి ప్లాన్ వేసింది. లోక్ నాధన్ స్నేహితులతో కలిసి సుందరి తన భర్తను హత్య చేసింది. అయితే తన భర్త శవాన్ని ఎక్కడ దాచాలో తెలియని సుందరి ఏకంగా ఫ్రిజ్ లోనే దాచి ఉంచింది. అయితే భర్త శవాన్ని ఫ్రిజ్ లో పట్టకపోవడంతో ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లోకి ఎక్కింది. అయితే పోలీసులు ఈ ఉందంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చి, సుందరి, లోక్ నాధన్ ను కటకటాల పాల్జేశారు. తన సుఖం కోసం వివాహేతర సంబంధం భర్తను కడతేర్చి సుందరి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథగా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more