తనను కాదని, వేరోక మహిళతో సహజీవనం సాగిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఓ టీవీ యాంకర్ నలుగురు చూస్తుండగానే తన భర్థ తాట తీసింది. నగరంలోని ఈసీఐఎల్లో టీవీ ఛానల్ యాంకర్ కుటుంబ కలహం కలకలం రేపింది.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళాసంఘాలతో కలిసి యాంకర్ భర్తపై దాడికి దిగింది. వివాహం జరిగి పది సంవత్సరాలు అయిన ఇప్పటికీ కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపించింది. గత కొన్నాళ్లుగా ఇంటికి రావడం లేదని వేరే మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిసి నిలదీశానని చెప్పింది. ఈ విషయం అడిగిన సమయంలో అందరి ముందరా ఆ భర్త ఆమెపై దాడికి దిగాడు.
ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్న పద్మావతి, సతీష్లకు పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం వీరిమధ్య మనస్పర్దలు రావడంతో రెండు సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో సతీష్ ఓ మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడంటూ పద్మావతి ఆరోపించారు. ఈ కారణంగానే తనను దూరంగా ఉంచి, మోసం చేశాడని ఆరోపించారు. తన వివాహ సమయంలో కట్నంగా 30 తులాల బంగారం, నగదు ఇచ్చినప్పటికీ తనను వేధింపులకు గురిచేశాడని పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తన పద్దతి మార్చుకోకపోవడంతో ఈరోజు సతీష్ నివాసం వద్దకు మహిళా సంఘాలతో వెళ్లి రెడ్హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ది చేసింది.
తన భార్య మహిళా సంఘాల నేతలతో ఒక్కసాగిగా అకస్మికంగా దాడి చేసి.. తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసిన క్రమంలోనూ యాంకర్ భర్త సతీష్ అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సతీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యాంకర్ పద్మవతి నుంచి పిర్యాదు తీసుకున్న కుషాయిగూడ పోలీసులు సతీష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more