తమ అధినేత ఆదేశం మేరకే తాను పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు వీడియో ఆధారం దొరికింది. అయితే అసలు సూత్రధారి నారా చంద్రబాబు నాయుడును A-1గా ఎందుకు చేర్చడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుపై ఎందుకు కేసు నమోదు చేయటం లేదని జగన్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసిన ఆయన మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు సూత్రధారులను అరెస్ట్ చేయాలని కోరారు.
అయితే గత వారంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో అవినీతికి పాల్పడ్డ వారిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తేలేదు అన్న వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ ను ఉద్దేశించే చంద్రబాబు చేశారు. కాగా మహానాడు ముగిసిన మూడు రోజులకే వైయస్ జగన్ఖ కు రేవంత్ రూపంలో మంచి అవకాశం దొరికింది. దాంతో ఎప్పుడెప్పుడు దాడి చేద్దామని ఎదురుచూస్తున్న జగన్ కు మంచి అవకాశం దొరికింది. అందుకే వచ్చిందే అవకాశంగా జగన్ మీడియా ముందుకు వచ్చారు. నారా చంద్రబాబును ఎందుకు అరెస్టు చెయ్యడం లేదు అంటూ ప్రశ్నించారు. పనిలో పనిగా గవర్నర్ నరసింహన్ ను కలిసి ఓటుకు నోటు వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని కోరారు. అలాగే అసలు సూత్రదారులను అరెస్టు చెయ్యాలంటూ చంద్రబాబు గురించి చెప్పకనే చెప్పారు. మరి జగన్ ఫిర్యాదు మేరకు చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తారో..? లేదో..? చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more