తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడాది పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు చూసిన వాళ్లు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా తెలంగాణ పది జిల్లాల్లో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్ లో జెండా వందనం నిర్వహించారు. తర్వాత స్పీచ్ మొదలుపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాల గురించి వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలకు రూ. 28 వేల కోట్లు కేటాయించామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.
ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని కేసీఆర్ వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తోంది అని వెల్లడించారు. ఇక రైతులకు రుణమాఫీ, మహిళల భద్రతకు షీ టీమ్స్, లాంటి వాటి గురించి వివరించారు. అయితే అందరు ఊహించినట్లుగా కేసీఆర్ కొత్తగా ఏమీ మాట్లాడలేదు. కనీసం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారు అని ఎంతో ఆశలు పెట్టుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు అసలు విషయమే అర్థం కాలేదు. ఏం జరిగిందో కూడా తెలుసుకునేలోపే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జై తెలంగాణ అంటూ స్పీచ్ ముగించేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more