నారా చంద్రబాబు నాయుడు ఏపిలొ చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో మాట్లాడారు. అయితే నవ నిర్మాణ దీక్షలో మాట్లాడిన నారా చంద్రబాబు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన విధానం అస్సలు బాగోలేదని అన్నారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు ఇలా ఎన్నడూ జరగలేదని అన్నారు. రాష్ట్రాన్ని విభజించదలచుకుంటే ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమని యూపీఏ సర్కార్కు విజ్ఞప్తి చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తెలిపారు. తన విజ్ఞప్తిని పక్కన పెట్టి యూపీఏ ప్రభుత్వం ఏక పక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన ఆరోపించారు. మంగళవారం బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రసంగించారు. ఓట్లు కావాలని.. సీట్లు గెలవాలని సోనియాగాంధీ భావించారు. అందుకోసమే హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి... ఆ నివేదికను పక్కన పెట్టి మరీ రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. సోనియా గాంధీకి డబ్బుపై మమకారం ఎక్కువని... అందుకే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడి చేయించారని చంద్రబాబు ఆరోపించారు.
ముందు నుండి టిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నట్లు నవ నిర్మాణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగానే సాగుతుందా అన్న అనుమానాలు కలుగక మానవు. తెలంగాణ ఏర్పాటు వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్న కీలక నేతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చంద్రబాబు ఇలా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినట్లు మాట్లాడటమే కాకుండా.. సమైక్యాంధ్ర ఉద్యామన్ని నడిపిన వారిని సన్మానించడం తెలంగాణకు వ్యతిరేకం అన్న సిగ్నల్స్ పంపినట్లు కాదా అని కొందరు తెలంగాణ వాదులు అంటున్నారు. అయినా సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక నేతలకు సన్మానం చెయ్యాల్సిన అవసరం ఏంటీ అని వారు ప్రశ్నిస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more