దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండల్లో ఎక్కువ సమయం ఉంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వడగాడ్పులు చాలా ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకూ వడగాడ్పులకు మరణించినవారి సంఖ్య 1,800కు పైనే. వీరిలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నిర్మాణ కార్మికులే. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికి 1,750 మంది వడదెబ్బకు మరణించారు. ఈ వారం మొదట్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీ సెల్సియస్కు చేరడంతో ఢిల్లీలోనే కాక గుజరాత్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజలు మృత్యువాత పడ్డారు. వడదెబ్బ తగిలిన వారితో ఢిల్లీలోని ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. వారు తీవ్రమైన తలనొప్పితో, కళ్లు తిరగడంతో బాధపడుతున్నారు.
కొందరిలో సంధి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గత ఏడాది కన్నా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, గతంలో కూడా తీవ్రమైన వడగాడ్పులు వీచిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్లో 2003 వడదెబ్బకు 3,000 మంది చనిపోయారు. అలాగే, 2010లోనూ అంతేమంది చనిపోయారని రాష్ట్ర అధికారులు తెలిపినా, చనిపోయిన వారి సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. భారతదేశంలో వాతావరణ మార్పుల కారణంగానే ఇంతటి తీవ్రమైన వడదెబ్బలకు జాతి బలవుతోందని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. 1950ల నుంచి చాలా ఆసియా దేశాల్లో చలి రోజులు తగ్గిపోయాయని, వేడి రాత్రులు ఎక్కువయ్యాయని గణాంకాలు తెలుపుతున్నాయి. చాలా కాలం తర్వాత ఇలాంటి ఎండలు చూస్తున్న జనం బెంబేలెత్తుతున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more