తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా, అసభ్యకరంగా వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ టీడీ9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారాలను నిలిపివేసిన సంగి తెలిసిందే! అయితే.. ఈ రెండింటిలో తిరిగి టీవీ9 ప్రసారాలు మొదలయ్యాయి కానీ.. ఏబీఎన్ ప్రసారాలు మాత్రం అలాగే నిలిచిపోయాయి. ఈ న్యూస్ ఛానెల్ ప్రసారాల్ని తిరిగి ప్రారంభించాలని ఛానెల్ యాజమాన్యంతోపాటు ఎందరో మంత్రులు కోరినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఏబీఎన్ న్యూస్ ఛానెల్ పై తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఈ వ్యవహారంపై స్పందించారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానెల్ ప్రసారాల నిలిపివేత సరైన చర్య కాదంటూ ఆయన స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలో స్థానిక చానెల్ ప్రసారాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోతే.. దాని ప్రసారాలను నిలిపి వేయడానికి వీల్లేదని అన్నారు. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలియజేసిందని వివరించారు. బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఓ విలేకరి తెలంగాణలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రసారాలను నిలిపివేసిన విషయంపై రాథోడ్ ను ప్రశ్నించారు. ఆ న్యూస్ ఛానెల్ ప్రసారాలను నిలిపివేసి ఏడాది అవుతోందని, తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదివరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి హోదాలో వచ్చిన ప్రకాశ్ జవదేకర్ను ఇదే విషయమై ప్రశ్నించగా, ‘రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తారం’టూ సమాధానమిచ్చారని, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదని ఓ విలేకరి ప్రశ్నించారు.
ఈ విధంగా ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు రాథోడ్ సమాధానం చెబుతూ.. ‘నాకు తెలిసి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అంశం కోర్టు పరిధిలో ఉంది. నిజానికి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపి వేయడం సరైన చర్య కాదు. ఇలాంటి చర్యలను కేంద్రం సమర్థించబోదు’ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఏబీఎన్ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించే అంశంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఈ చానెల్ పై ఇంకా ఎన్నాళ్లవరకు ఇలా సంకెళ్లు కొనసాగుతాయో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more