తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని టిడిపి పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు మహానాడులో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివరించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్మృతులను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ చీర ధోవతి కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. రూ.400 కోట్లతో ఎన్టీఆర్ చీర ధోవతి కార్యక్రమాన్ని చేపడతామన్న బాబు వీలైతే దసరాకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలు కొత్త బట్టలు కట్టుకునే అవకాశం వస్తుందన్నారు. శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గోదావరి తీరంలో పెట్టాలని మహానాడు తీర్మానించింది. చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలను మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని.. 1983లో ఆహారభద్రతను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్దే అని నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. వ్యవసాయరంగంలో విప్లవం తీసుకువచ్చారని, ఎన్టీఆర్ పరిపాలన సంక్షేమానికి మారు పేరు అని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసేతర పార్టీలను ఐక్యం చేసిన ఘనత ఎన్టీఆర్దే అని వెల్లడించారు. రాయలసీమలో కరువు వస్తే జోలె పట్టి డబ్బు వసూలు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చంద్రబాబు చెప్పారు. కష్టపడటం ఎలాగో ఎన్టీఆర్ను చూసి నేర్చుకోవాలన్నారు. బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారమిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త అర్ధమిచ్చిన ప్రజానాయకుడన్నారు.ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిందని ఎన్టీఆరే అని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయించామని వెల్లడించారు. ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరును కొనసాగించినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల ఘాట్ వద్ద శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు పెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more