తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పుల వర్షం కురిపించారు టిడిపినేత ఎర్రబెల్లి దయాకర్ రావ్. తెలంగాణ కోసం కడియం ఎప్పుడూ పోరాటం చేయలేదన్నారు. తుమ్మల, శ్రీనివాస్యాదవ్ జై తెలంగాణ అని ఎప్పుడూ అనలేదని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, దళితులను కేసీఆర్ మర్చిపోయారన్నారు. దళితున్ని సీఎం చేయకపోతే మెడకాయ నరుకుంటానన్న కేసీఆర్ ఆ హామీని మరిచారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ పిచ్చితుగ్లక్లా రాజ్యమేలుతున్నారని విమర్శించారు. దమ్ముధైర్యముంటే నలుగురు ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి గెలిపించాలని సవాల్ విసిరారు. వారిని గెలిపిస్తే. వచ్చే మహానాడులో కేసీఆర్ అభినందన సభను ఏర్పాటు చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చంలో టీఆర్ఎస్ ప్రభుత్వం టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారని ప్రశ్నించారు. కుటుంబం కోసమే కేసీఆర్ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆరోపించారు. ఖబడ్దార్.. కేసీఆర్ సంగతి తేల్చేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు. ఉద్యమంలో తీవ్రంగా శ్రమించిన విద్యార్థులకు ఏం చేశారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఉన్న వారంతా తెలంగాణ ద్రోహులని...వారికే పెద్దపీట వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం చంద్రబాబు రాసిన లేఖకు అడ్డుపడింది తెలంగాణ నేతలు శ్రీనివాస్, తలసాని కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ ఆదరించలేదని వ్యాఖ్యానించారు. టీడీపీకి కేడర్ పటిష్టంగా ఉందని.. కొంత మంది నాయకులు మాత్రమే పార్టీని వదిలిపెట్టారని ఎర్రబెల్లి తెలిపారు. హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ జెండాను ఖచ్చితంగా ఎగురవేస్తామన్నారు. టీడీపీ ద్వారానే ముప్పు ఉందని కేసీఆర్ తమ పార్టీ వెంట పడుతున్నారని.. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బలం లేదని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి గెలుపు ఖాయం అని వెల్లడించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more