Errabelli Dayakar Rao, Mahanadu, KCR, TRS

Errabelli dayakar rao gave a warning and offer to telangana cm kcr in mahanadu

Errabelli Dayakar Rao, Mahanadu, KCR, TRS

Errabelli Dayakar Rao gave a warning and offer to telangana cm kcr in Mahanadu. TTDP senior leader Errabelli Dayakar Rao said that TRS party loss the credibility in telangana.

ITEMVIDEOS: కేసీఆర్ కు ఎర్రబెల్లి ఓ వార్నింగ్, ఓ ఆఫర్

Posted: 05/28/2015 04:04 PM IST
Errabelli dayakar rao gave a warning and offer to telangana cm kcr in mahanadu

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పుల వర్షం కురిపించారు టిడిపినేత ఎర్రబెల్లి దయాకర్ రావ్. తెలంగాణ కోసం కడియం ఎప్పుడూ పోరాటం చేయలేదన్నారు. తుమ్మల, శ్రీనివాస్‌యాదవ్‌ జై తెలంగాణ అని ఎప్పుడూ అనలేదని తెలిపారు.  ఎన్నికల మేనిఫెస్టో, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, దళితులను కేసీఆర్‌ మర్చిపోయారన్నారు. దళితున్ని సీఎం చేయకపోతే మెడకాయ నరుకుంటానన్న కేసీఆర్‌ ఆ హామీని మరిచారని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ మాటలను నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ పిచ్చితుగ్లక్‌లా రాజ్యమేలుతున్నారని విమర్శించారు. దమ్ముధైర్యముంటే నలుగురు ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి గెలిపించాలని సవాల్‌ విసిరారు. వారిని గెలిపిస్తే. వచ్చే మహానాడులో కేసీఆర్‌ అభినందన సభను ఏర్పాటు చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.

ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారని ప్రశ్నించారు. కుటుంబం కోసమే కేసీఆర్‌ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆరోపించారు. ఖబడ్దార్.. కేసీఆర్‌ సంగతి తేల్చేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు. ఉద్యమంలో తీవ్రంగా శ్రమించిన విద్యార్థులకు ఏం చేశారో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రి వర్గంలో ఉన్న వారంతా తెలంగాణ ద్రోహులని...వారికే పెద్దపీట వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం చంద్రబాబు రాసిన లేఖకు అడ్డుపడింది తెలంగాణ నేతలు శ్రీనివాస్‌, తలసాని కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్‌ ఆదరించలేదని వ్యాఖ్యానించారు.   టీడీపీకి కేడర్‌ పటిష్టంగా ఉందని.. కొంత మంది నాయకులు మాత్రమే పార్టీని వదిలిపెట్టారని ఎర్రబెల్లి తెలిపారు. హైదరాబాద్‌ ఎన్నికల్లో టీడీపీ జెండాను ఖచ్చితంగా ఎగురవేస్తామన్నారు.  టీడీపీ ద్వారానే ముప్పు ఉందని కేసీఆర్‌ తమ పార్టీ వెంట పడుతున్నారని.. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి  బలం లేదని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి గెలుపు ఖాయం అని వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Errabelli Dayakar Rao  Mahanadu  KCR  TRS  

Other Articles