నందమూరి తారక రామారావు వారసులుగా అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణించారు బాలకృష్ణ, హరికృష్ణ. తండ్రికి తగిన తనయులుగా ఇద్దరికీ మంచి గుర్తింపు ఉంది. అయితే ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి క్యు కట్టారు. నందమూరి ఫ్యామిలీలో పెద్దవాడైన హరికృష్ణ, తర్వాత బాలకృష్ణలతో పాటు దాదాపు అందరు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటుకు చేరుకొని నివాళి అర్పించారు. పుష్పగుచ్చాలు సమర్పించి ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న బాలకృష్ణ, హరికృష్ణల గురించే అక్కడి వారంతా చర్చించుకున్నారు. ఎందుకు అంతలా చర్చించుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారా..? వాళ్లు వేసేకున్న చొక్కాలు. ఏంటీ చొక్కాల గురించి మాట్లాడుకునేంతగా ఏముంది అంటారా..?
ఎన్డీఆర్ ఘాట్ కు వచ్చిన నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ కలరైన పసుపు రంగు చొక్కా వేసుకొని వచ్చారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి తన తండ్రికి నివాళి అర్పించారు. కానీ హరికృష్ణ మాత్రం పసుపు పచ్చ చొక్కా కాకుండా ఎరుపు చొక్కా వేసుకొచ్చారు. అయితే బాలకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారని, కానీ హరికృష్ణ మాత్రం పార్టీకి కాస్త దూరంగా ఉన్నారని అందుకే అలా పసుపు చొక్కా వేసుకొని రావడానికి ఇష్టపడి ఉండరని సమాచారం. ఏది ఏమైనా అక్కడికి వచ్చిన వారు మాత్రం బాలకృష్ణ, హరికృష్ణల గురించే మాట్లాడుకున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more