కిరాతకం, దారుణం, ఘోరం ఇలా ఎన్ని పదాలు వాడినా అందుకు తక్కువే. ISIS ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న అరాచకం గురించి ప్రపంచానికి తెలుసు.. కానీ వాళ్లు ఆడవారి మీద చేస్తున్న దారుణాల గురించి రాయడానికి పదాలు సరిపోవడం లేదు. మదమెక్కిన వారికి అక్కడ ఆడవాళ్లు అంటే ఆట బొమ్మ కన్నా దారుణంగా కనిపిస్తారు. అక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మినట్లుగా ఆడవాళ్లను అమ్ముతారు. అలా ఆడవాళ్లను కొన్న వారికి వాళ్లు సేవలు చెయ్యాలి. ఒకవేళ ఆడవాళ్ల మీద విరక్తి కలిగితే వాళ్లను మూడు నాలుగు నెలలు అనుభవించి తిరిగి అమ్మకానికి పెడతారు. ఏంటని ఎదురు తిరిగినా..? ప్రశ్నించినా తల, మొండెం వేరవుతాయి. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా వీధులలో ఊరేగించి.. తర్వాత రాళ్లతో కొట్టి, తల నరికేస్తారు. ఇది అక్కడ రోజూ జరిగే వ్యవహారం.
ఒకవేళ తల నరకడం వాళ్లకు బోర్ కొడితే బతికుండగానే మంటల్లో కాల్చేస్తారు. ఆడవాళ్ల మర్మాంగాలు కోసి అందరికి చూపిస్తూ పైశాచిక ఆనందం పొందేవాళ్లు చాలా మందే ఉంటారు. దాదాపు 100 దేశాలకు చెందిన వారు ఇస్టామిక్ స్టేక్ ఆఫ్ ఇరాక్ అండ్ ఇరాన్ కు వచ్చి ఉన్నారు. అక్కడ ఉంటున్న స్థానిక యజీదీ తెగకు చెందిన మహిళలకు మరింత నరకాన్ని చూపిస్తున్నారు ISIS వాళ్లు. రోడ్డు మీదకు ఆడవాళ్లను తీసుకువచ్చి.. మార్కెట్లో వేలం వేస్తారు. అలా వేలం వేసేటప్పుడు ఆడవాళ్లను బట్టలు లేకుండా దాదాపు వంద మంది దాకా ఒకేసారి నిలబెట్టి వేలం వేస్తారు. వేలం జరిగేపుడు ఎవరైనా మహిళలు ఏడ్చినా లేదా ఇంకేమైనా చేసినా వాళ్లను కొట్టి చంపేస్తారు.
తాజాగా అక్కడి దారుణాలను వివరిస్తూ యుఎన్ అధికారిణి జైనాబ్ బంగూరా వెల్లడించిన నిజాలు యావత్ ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 20 ఏళ్ల లోపు అమ్మాయిలను ముందుగా ISIS నాయకులకు ఆఫర్ చేస్తారు. వాళ్లు అనుభవించిన తర్వాత కింద క్యాటర్ కు ఆఫర్ చేస్తారు వాళ్లకు నచ్చని వారిని డైరెక్ట్ గా మార్కెట్ లో అమ్మేస్తారు. ISIS క్యాడర్ చరిచిన తర్వాత కూడా మహిళలు బతికే ఉంటే వాళ్లను కింది వారికి గిఫ్ట్ గా ఇస్తారు. ఆడపిల్ల అయితే చాలు మృగాళ్లగా మీదపడి.. కనీసం మనుషులు అన్న ధ్యాస కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎదురించిన ఆడవాళ్లను అందరు ఆడవాళ్ల ముందు అతి కిరాతకంగా చంపేస్తు వాళ్లను హెచ్చరిస్తున్నారు. ఇలా అక్కడి దారుణాలను జైనాబ్ వివరించిన తీరు గుబుత్సాకరంగా అనిపించింది. అక్కడ జరుగుతున్న దారుణాలు ఆపడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని ఆమె కోరారు.
{besps}ISISWOMEN{/besps}
ఆడవాళ్లు, చిన్న పిల్లలను బానిసలుగా గుర్తిస్తూ అక్కడ ఫత్వాను విడుదల చేశారు. అందులో భాగంగా ఆడవాళ్లను బానిసలు పొందిన వాళ్లు సర్వ హక్కులు పొందుతారు. చివరకు వాళ్లు చంపినా కూడా ఎలాంటి ఫిర్యాదు ఉండదు. ఇక ఇప్పటి దాకా దాదాపుగా 4500 మంది యజీదీ అమ్మాయిలు కనిపించకుండాపోయారు. దానికి అర్థం దాదాపుగా వాళ్లు చనిపోయారని. ఇంకె 2500 వేల మంది అమ్మాయిలు ఉగ్రవాదుల చేతిలో బందీలుగా, బానిసలు ఉన్నారు. ఖురాన్ లో బార్యలతో కాకుండా బానిసలతో సంభోగం చేసే అవకాశం ఉందని వారు గట్టిగా నమ్ముతారు.
దాదాపుగా 40 వేల మంది మగవారు ఐఎస్ఐఎస్ కోసం పనిచేస్తుండగా వారికోసం అమ్మాయిలను, మహిళలను అతిదారణంగా పంపిణీ చేస్తున్నారు. అక్కడ అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తూ వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. మానవత్వం అన్న మాటను ఎప్పుడో మరిచి పైవాచికత్వం అక్కడ స్వైర విహారం చేస్తూ ఉంటుంది. ఆడవారు అంటే గౌరవం మాట అంటుంచి వారిని తోటి మనుషులు అన్నట్లుగా కూడా ట్రీట్ చెయ్యడం లేదు. ఆడవారి గురించి అతినీచంగా ఆలోచించడం, వారికి కిరాతకం అంటే ఏంటో చూపిస్తున్నారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.
ఇటీవల వీరి నుంచి విడుదలైన వారు.. తాము అనుభవించిన నరకాన్ని మీడియాకు తెలిపారు. 14, 15 ఏళ్ల వయస్సుండే పరమత అమ్మాయిలపై అనునిత్యం అత్యాచారాలు జరిపే వారు. బహిరంగంగానే వారిపై జరుగుతున్న అత్యాచారాల ఎదుర్కోన్న అమ్మాయిలు.. ఇదేనా నరకం అనేలా బాధ పడ్డారు. జీవం వున్న బోమ్మల మాదిరిగా తాము వారి అకృత్యాలను సహించాల్సి వచ్చిందని, వారు చిత్రహింసలు చెప్పనలవి కావని అబాగినులు విలపిస్తూ చెప్పారు. కొందరు అమ్మాయిలు తమపై జరుగుతున్న ఘోర కలిని భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వివరించారు.
గత ఏడాది అగస్టు మాసంలో ఇరాక్ లోని సింజర్ ప్రాంతాన్ని తమ కబంధ హస్తాలలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. ఆక్కడున్న యాజిది మహిళలను, పిల్లలను తమ బంధీలుగా చేసుకుని ఎనమిది నెలల తరువాత కొందరి విడుదల చేశారు. తమపై ఉగ్రవాదులు అత్యాచారాలకు తెగబడటంతో పాటు తమకు నచ్చిన వారికి బహుమానంగా కూడా ఇచ్చేవారని, అక్కడ కూడా తాము మానసికంగా, శారీరకంగా అనేక బాధలు పడాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు.ఇలా కొన్ని వేల మంది ఆడవాళ్ల ఉసురుతీస్తున్న ISIS ఉగ్రవాదులపై ఇక అన్ని దేశాలు యుద్దానికి సిద్దం కావాల్సిన సమయం దగ్గర పడింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more