అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు తాను బాధితురాలిపై అత్యాచారం చేయలేదని, అలా అని బలవంతం కూడా చేయలేదని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పెట్టుకున్న పిటీషన్ ను విచారించిన బోంబే హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ గడ్కరీ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. అదేలా సాధ్యం..? అత్యాచార నిందితుడికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చిందని మీ సందేహం కదా..? సాధరణంగా ఈ కేసులో బెయిల్ లభించాలంటే నిందితుడు కనీసం 45 రోజుల పాటు జైలులో వుండాలి. ఆ తరువాత కూడా న్యాయస్థానం విచారణ జరిపి బెయిల్ ఇస్తుంది. కానీ నిందితుడికి ముందస్తు బెయిల్ ఎలా వచ్చిందా..? అనుకుంటున్నారా.?
ఇక్కడ నిందితుడు తన తప్పును తెలుసుకుని, సరిదిద్దుకుంటానని న్యాయస్థానానికి తెలపడంతో.. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తనతో సన్నిహితంగా మెలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిన నిందితుడు జయవంత్ జాదవ్ కు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ గడ్కరీ బెయిల్ ఇచ్చారు. బాలికను మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకున్న జాదవ్ పై ఏప్రిల్ 4న ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన బాలికతో జాదవ్ పరిచయం పెంచుకున్నాడు. తర్వాత వారిద్దరూ హద్దులు దాటారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పెళ్లి చేయాలని జాదవ్ తల్లిదండ్రులను కోరగా వారు తిరస్కరించారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కేసు పెట్టారు. అయితే బాలికను పెళ్లాడేందుకు నిందితుడు ఒప్పుకోవడంతో కోర్టు ఈనెల 28 వరకు ముందస్తు బెయిలిచ్చింది. భవిష్యత్ లో ఆమెకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని జాదవ్, అతడి కుటుంబ సభ్యులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more