nagam | osmania university | students | kcr

Nagam janrdhan reddy warning about osmania university students

nagam, osmania university, students, kcr, telangana, land

Nagam janrdhan reddy warning about osmania university students. nagam janadhan reddy alredy faced problem from the ou students.

వాళ్లతో పెట్టుకుంటే కేసీఆర్ పంబ పగులుద్ది

Posted: 05/20/2015 03:25 PM IST
Nagam janrdhan reddy warning about osmania university students

తెలంగాణ ఉద్యమ సమయంలో నాగం జనార్దన్ రెడ్డిని క్యాంపస్ లోనే విద్యార్తులు కొట్టడం అప్పుడు వార్తల్లో సెన్షేషనల్ అయింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా, తెలుగుదేశం పార్టీ కానీ, పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు కానీ కనీసం మాట్లాడకపోవడంపై విద్యార్తులు ఉడికిపోయారు. అందుకే అప్పుడు అనుకోని పరిస్థితిలో నాగం జనార్దన్ రెడ్డిపై చేయిచేసుకున్నారు. అయితే తర్వాత పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చారు నాగం జనార్దన్ రెడ్డి. అయితే అప్పుడు ఓయు విద్యార్థులు ఇచ్చిన షాక్ నాగం కు బాగా తగిలింది. అందుకే ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. పాపం తనలాగా కావద్దని వార్నింగ్, సలహా ఇస్తున్నారు. ఇంతకీ ఎవరికో తెలుసా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇల్లు కట్టిస్తామని ప్రకటన చేశారు. అయితే ఓయు భూములను ఇవ్వడానికి వీలులేదంటూ విద్యార్థులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఓయు విద్యార్థులతో మాత్రం పెట్టుకోవద్దు బాబోయ్ అంటు వార్నింగ్ ఇస్తున్నారు నాగం జనార్దన్ రెడ్డి. ఎంతో మంది ఉస్మానియా విద్యార్థుల త్యాగాల ఫలితాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కానీ ఇప్పుడు విద్యార్థులను బచ్చాగాళ్లు అంటూ మాట్లాడటం ఏం బాగోలేదని ఆయన అన్నారు. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి ఓయు విద్యార్థుల గురించి మాత్రం వార్నింగ్ ఇస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagam  osmania university  students  kcr  telangana  land  

Other Articles