నేపాల్లో వరుస భూప్రకంపనలతో ప్రజలు అల్లాడుతున్నారని... శనివారం నుంచి దాదాపు 60సార్లు కంపించిన భూమి.. ప్రళయాన్ని సృష్టించిందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 వేల 500లకు చేరిన మృతుల సంఖ్య మరింత పెరిగి పదివేల వరకు చేరుకుంటుందని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల అందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రకోపంతో చెల్లచెదురైన తమ వారి జాడను తెలుసుకునే నేపథ్యంలో స్థానికులే.. శిధిలాలను తోలగిస్తున్నారని, ప్రభుత్వం నత్తనడకన చర్యలు చేపడతుందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపడుతుందని, వరుసగా ప్రకృతి ప్రకోపాల నుంచి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేయాల్సిన దానికన్నా వేగంగా చర్యలను తీసుకుందని చెప్పారు. అనేక చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కసారిగా వరుస విపత్తులు మీదపడటంతో సహాయక చర్యలను ఒక సవాల్ గా తీసుకుంటున్నామని, ప్రస్తుతం నేపాల్ అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటుందని అన్నారు. శిధిలాల కింద వున్న వారిని భయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందన్నారు.
భూకంప తీవ్రతలో దాగిన 20 అణుబాంబుల శక్తి
చారిత్రక నిర్మాణాలను నేలమట్టం చేసి.. వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న నేపాల్ భూకంపం తీవ్రత ఎంత? రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైన తీవ్రత వెనుక 20 థర్మో న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబులు పేలితే ఉత్పన్నమయ్యే శక్తితో సమానమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. హిరోషిమా నగరాన్ని సర్వనాశనం చేసిన అణుబాంబు కన్నా అనేక రెట్లు శక్తిమంతమైనదని వివరిస్తున్నారు. రెండు కోట్ల 80 లక్షల జనాభా కలిగిన నేపాల్లోనే అత్యంత అధిక జనసాంద్రత కలిగిన ఆ దేశ రాజధాని ఖాట్మండుకు కేవలం 40 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉండటం.. భూమి పైపొర నుంచి కేవలం 10-15 కిలోమీటర్ల లోతునే భూకంపం రావడం వల్ల దాని తీవ్రత భారీస్థాయిలో ఉందని, మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more