ప్రకృతి ప్రకోపానికి గురై భూతల స్వర్గాన్ని తలపించి ఆధ్యాత్మికతకు, చక్కటి ప్రకృతికి అలవాలంగా నిలచిన నేపాల్ మరుభూమిగా మారిందని భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అవేదన చెందారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ప్రతి ఒక్క నేపాలీయుడి కన్నీళ్లు తూడుస్తామని నరేంద్ర మోదీ అన్నారు. ఆపదలో ఉన్న ఏ దేశాన్నైనా ఆదుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుందని అన్నారు. నేపాల్కు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. పోరుగు రాష్ట్రంతో పాటు భారత్ లోనూ భూ ప్రకంపనలు భీభత్సాన్ని సృష్టించాయన్నారు.
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేపాల్ సోదరుడు, సోదరీ మణులకు భారత్ ఎప్పుడూ అండంగా ఉటుందని చెప్పారు. వారి చేతులను తమ చేతుల్లోకి తీసుకుని ధైర్యం చెప్తామన్నారు. భూకంపంతో తీవ్ర విషాదంలోకి జారిన నేపాల్ ను అదే విషాధాన్ని ఎదుర్కోంటున్నా భారత్.. సాయమందించడంలో ముందునిలుస్తుందన్నారు.. ఈ భూకంపం ఒక్క నేపాల్, భారత్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసిందని చెప్పారు. ఏ రకంగా అవకాశం ఉన్నా సహాయం చేసేందుకు భారత్ పూర్తి సిద్ధమని చెప్పారు.
2000లకు చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య
కాగా, నేపాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెరుగుతున్న సంఖ్య స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజా నివేదికల ప్రకారం రెండు వేలకు పైగా మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. ఒక్క ఖాట్మండులోనే వెయ్యి మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. వేలమంది ప్రజలు వెన్నులోకి చీల్చుకుని వెళ్తున్న చలిలోనే వణికిపోతూ.. రోడ్లపైనే జాగారం చేశారు. భూకంపం ధాటికి ఎవరెస్టు శిఖరంపై దాదాపు 18 మంది మరణించారు. ఈ తీవ్ర ధాటికి భారత్లోనే 53 మంది మృతి చెందగా.. 240 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more