ఏపీకి ప్రత్యేక హోదా గురించి లోక్సభలో కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజీత్ సింగ్ ఇచ్చిన సమాధానం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. విభజనకు ముందు యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించగా.. తమ ప్రభుత్వం కూడా ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటామని ఇన్నాళ్లు సాగదీస్తూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చింది. ఇక ఎన్నికలకు ముందు ప్రతి సందర్భంలోనూ ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ నేతలు హామీల మీద హామీలు గుప్పించి.. తీరా అవసరం తీరాక నట్టేట ముంచుతారా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ప్రకటనపై పార్టీలకతీతంగా నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్తో..ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉండగా..ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో రావు ఇంద్రజిత్ ఇచ్చిన సమాధానం నిరాశనే మిగిల్చింది. ఇటీవల ఏపీ భవన్లో టీడీపీపీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇచ్చేట్టు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపిస్తోందనీ, అయినప్పటికీ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని ఆ విషయాన్ని కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక ప్రగతి వేగవంతం అవుతుందని తద్వారా ఉపాధి హామీ జరుగుతుందని, ఎన్నో వేల ఉద్యోగాలు వస్తాయని అందరూ భావించినప్పటికీ, ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ చరిత్రలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది.
ప్లేటు ఫిరాయించిన టీడీపీ, బీజేపీలు: ద్రోణం రాజు శ్రీనివాసరావు
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఏపీ కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర ప్రణాళిక సంఘం మంత్రి ఇంద్రజిత్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ప్రత్యేక హోదా కోసం నేతలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదాను తీసుకువస్తామని ఎన్నికలలో ఊరూరా ప్రచారాన్ని నిర్వహించిన బీజేపీ, టీడీపీ నేతలు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. బీజేపి, టీడీపీ కలసి ప్రజలను మోసం చేస్తున్నాయని ద్రోణం రాజు మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధించేందుకు కాం
చంద్రబాబు మౌనం వీడాలి: సీపీఐ నేత రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టతనివ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సలమేరకు ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని శుక్రవారం నాడు పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన రామకృష్ణ, బీజేపీ తీరుపై మండిపడ్డారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశమై చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలు చేశారని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు మౌనం విడాలని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
బీజేిప ద్వంద వైఖరి బయటపడింది: సీపీఎం నేత మధు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి బయటపడిందని ఏపీ సీపీఎం నేత మధు వ్యాఖ్యానించారు. ఈ అంశమై శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఆరోపించారు. కేంద్రం సాంకేతిక కారణాలను సాకుగా చూపుతోందని విమర్శించారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయవచ్చునని సూచించారు. బీజేపీ, టీడీపీలది పచ్చి అవకాశవాద రాజకీయం అని నిప్పులుచెరిగారు. బీజేపీ వైఖరిని టీడీపీ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మధు డిమాండ్ చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more