ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి వివాదానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెరదించారు. సిట్టింగ్ ఎంపీలు ఒలింపిక్ అధ్యక్ష పదవిని చేపట్టరాదని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు సూచనతో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సంబంధించిన వివాదం సద్దుమణిగినట్లైంది. ఢిల్లిdలో మంగళవారం సాయంత్రం జరిగిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎంపీల సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎలింపిక్ అసోసియేషన్ వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చంది. ఒకే పార్టీకి చెందిన ఎంపీలు అధ్యక్ష పదవికోసం పోరాడడం మంచి సంప్రదాయం కాదని, హైకోర్టును ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని మరింత జఠిలం చేయడం మానుకోవాలని చంద్రబాబు కోరారు.
ఒలింపిక్ సంఘానికి తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అధ్యక్ష స్థానం కోసం పోటీ పడడం లేదని ఈ పదవిని వారు వదిలి వేస్తున్నారని కేంద్ర మంత్రి సత్యనారాయణ చౌదరి చెప్పారు. కొత్త రాష్ట్రంలో పరిష్కరించవలసిన సమస్యలు ఎన్నో ఉన్నాయని ఆ సమస్యలను పూర్తి చేసేందుకు ఎంపీలంతా దృష్టి సారించాలని చంద్రబాబు కోరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి గల్లా జయదేవ్, సీఎం రమేష్లు తప్పుకుంటుంన్నారని ఇందుకు ఈ ఇద్దరు ఎంపీలు అంగీకారం కూడా తెలిపారని ఆయన చెప్పారు. ఈ పదవికోసం పోటీ పడుతున్న ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్లను తప్పుకోవలసిందిగా చంద్రబాబు ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఇద్దరు ఎంపీలతో చంద్రబాబు దాదాపు అరగంటకు పైగా చర్చించారు. సిట్టింగ్ ఎంపీలు ఈ పదవిని ఆశించవద్దంటూ స్పష్టం చేశారు. ఈ ఇద్దరి బదులు వేరే వ్యక్తిని నియమిస్తామని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో సంతృప్తి వ్యక్తం చేసిన జయదేవ్, రమేష్లు ఒకే కారులో వెళ్ళిపోవడం గమనార్హం. అసోసియేషన్ అధ్యక్షుని ఎంపిక బాధ్యత చంద్రబాబును తీసుకోవలసిందిగా ఎంపీలు కోరారు. దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పారు
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more