ప్రభుత్వాలు మారినపుడు ఫోటోలు, పేర్లు మారడం మామూలే. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పాత ప్రభుత్వాల జాడలు కనిపించకుండా వాటిని తొలగిస్తుంది. గతంలో పార్టీ గుర్తులను, పార్టీలో ప్రముఖులను ప్రచారంలో వాడుకోవడం తర్వాతి ప్రభుత్వాలు వాటిని తొలగించేస్తుంటాయి. తాజాగా అలా గతంలో యుపిఎ ప్రభుత్వం జాడలను కూడా ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా తొలగించాలని ప్రయత్నిస్తున్నట్లుంది. అధికరంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కూడా పాత కాంగ్రెస్ ఫోటోలు, పేర్లను కూడా తోలగించేస్తోంది. అయితే అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, గత ప్రధానులుగా పని చేసిన రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల పేర్లను తొలగిస్తూ తాజాగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి తావిస్తోంది.
హిందీ దివస్ రోజు హిందీ సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన కొంత మంది సాహితీవేత్తలకు ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేస్తూ వస్తోంది. అయితే గతంలో ఇందిరా గాంధీ రాజ్ భాషా పురస్కార్ పేరులో ఇందిరా గాంధీ పేరును తొలగించి రాజ్ భాషా కీర్తి పురస్కార్ గామార్చింది ప్రభుత్వం. అలాగే రాజీవ్ గాంధీ రాష్ట్రీయ గ్యాన్ విగ్యాన్ మౌలిక్ పుస్తక్ లేఖన్ పురస్కార్ పేరును కూడా రాజ్ భాషా గౌరవ్ పురస్కార్ అని పేర్లు మార్చింది. మొత్తానికి అధికరానికి వచ్చిన మోదీ సర్కార్ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను తొలగించి, వాటిని ప్రధానం చెయ్యడానికి సిద్దపడుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more