అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మనదైన ముద్ర వేశామని, పార్లమెంట్లో బలమైన శక్తిగా ఉంటే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్షాపును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షేమ పథకాలపై ఎంపీలకు వివరించారు. మనపై ప్రజలకు నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. యెమెన్లో చిక్కుకున్న భారతీయులను సమర్థవంతంగా కాపాడుకోగలిగామని, మంత్రి వికె సింగ్ సమర్థవంతంగా పనిచేశారని ఆయన ప్రశంసించారు.
విధేశీ పర్యటనలో భాగంగా పలు దేశాలతో ఒప్పందాలు కుదిరాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఆయన సూచించారు. కేనడాతో యూరేనియం ఒప్పందం చారిత్రకమని, దీనిపై ప్రశంసలు అందుతున్నాయని ఆయన అన్నారు. భారత్లో పెట్టుబడులకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. పేదలను ధనికులుగా మార్చడమే మా లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. భారత్లో బలమైన ప్రతిపక్షముంటేనే బాగుంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమానికి ఎన్డీయే కట్టుబడి ఉందని ఆయన అన్నారు. మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను పట్టించుకోవద్దని ఆయన అన్నారు. అవినీతిరహిత భారత్ను నిర్మిద్దాని మోదీ పిలుపునిచ్చారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more