ఏమి సేప్తిరి ఏమి సేప్తిరి దాసరిగారూ.!!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ప్రమేయం ఉన్నట్లు సీబీఐ తేల్చేసింది. జిందాల్ కంపెనీ నుంచి 2.25 కోట్లు క్విడ్ ప్రోకో రూపంలో దాసరి కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఈ కేసులో భాగంగా సీబీఐ, ఈడీ అధికారులు దాసరిని పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.
బొగ్గు కుంభకోణం కేసులో సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావుకి చెందిన రూ. 2.25 కోట్ల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఆయన ఆ శాఖ మంత్రిగా వున్న సమయంలో బొగ్గు నిక్షేపాల కేటాయింపుల్లో జిందాల్ కంపెనీకి అక్రమంగా మేలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియాకు చెందిన ఎకౌంట్లోకి రూ. 2.25 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని పేర్కొంటూ ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది.
మనీ లాండరింగ్ ద్వారా సౌభాగ్య మీడియాలోకి పెట్టుబడులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. జిందాల్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా గనుల్ని కేటాయించడం వల్లనే ఈ పెట్టుబడులకు తెరలేచిందనే ఆరోపణలు వెల్లువెత్తడమంటే దాసరి నారాయణరావు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లే.
అయితే, దాసరి వాదన ఇంకోలా వుంది. అటాచ్ అయినవి తన వ్యక్తిగత ఆస్తులు కావనీ, సౌభాగ్య మీడియా సంస్థలో తాను వాటాదారుడ్ని మాత్రమేననీ, అది లిస్టెడ్ కంపెనీ అని దాసరి చెబుతున్నారు. కానీ, సౌభాగ్య మీడియా.. అంటే అది దాసరి సొంత సంస్థ అన్న భావన వుంది. మిగతా విషయాలెలా వున్నా, సౌభాగ్య మీడియాలో తాను వాటాదారుడ్ని మాత్రమేనని దాసరి అనడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పైగా, సౌభాగ్య మీడియా ఆస్తులు అటాచ్ అయి వుండొచ్చని ఆయన లైట్ తీసుకోవడం మరింత ఆశ్చర్యపరిచింది అందర్నీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more