ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధ్వజమెత్తారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రంపై సోనియాగాంధీ విమర్శలు తీవ్రతరం చేశారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీలను దేశాభివృద్ది వ్యతిరేక పార్టీలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వ తీరుపై అమె నిప్పుటు చెరిగారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన భూ సేకరణ బిల్లుతో.. అటు అభివృదితో పాటు భూములు కోల్పోతున్న రైతులకు కూడా మేలు జరిగేలా వుందని, దానని సవరించిన ఎన్డీఏ ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు.
రైతులు, పేదల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక కార్యక్రమాలకు స్వీకారం చుట్టిందని మండిపడ్డారు. భూ సేకరణ చట్టం బిల్లుపై అమె సంబంధిత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సోనియా లేఖ రాశారు. భూసేకరణ సవరణ బిల్లు రైతులకు నష్టం చేసేలా ఉందన్నారు. ఈ బిల్లులో ఏ ఒక్క అంశాన్ని సవరించినా.. జాతి వెన్నుముక్కను విరిచినట్లేనని అమె పేర్కోన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న ఉద్యమాలపై ప్రజలకు అబద్దాలను చెబుతూ.. తప్పుదోవ పట్టించే యత్నాలను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.
ఈ తరహా చర్యలతో తాను పోరబాటున కూడా ఆశ్చర్యానికి లోనుకానని, లాజిక్ లు లేకుండా మాట్లాడటం, తమ వాదనలను సమర్థించుకునే ప్రభుత్వం ఇంతకన్నా ఏం చేస్తుందని ఆమె తన లేఖలో ప్రశ్నించారు. ఈ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు నష్టపోతారని ఆమె శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని సోనియాగాంధీ తెలిపారు. భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని, ఇకపై కూడా చేస్తామని అమె స్పష్టం చేశారు. తమతో కలసివచ్చే మిత్రులతో కలసి ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహింస్తామన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more