‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్, నటి జయసుధ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! వీరిద్దరికీ సపోర్ట్ చేస్తూ కొందరు నటీనటులు మద్దతు పలికారు. ఈ క్రమంలోనే వీరంతా రాజేంద్రప్రసాద్ ప్యానెల్, జయసుధ ప్యానెల్ అని రెండు వర్గాలు విడిపోయారు. అయితే.. వీరి మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి విదితమే! ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా.. వ్యక్తిగత విషయాల్లోనూ గొడవలు పడుతున్నారు.
ఇదిలావుండగా.. ఇటీవలే తనను పోటీనుంచి తప్పుకోవాలంటూ రాజకీయ నాయకులతో రాజేంద్రప్రసాద్ ప్యానెల్ సభ్యులు ఫోన్ చేయిస్తున్నారని జయసుధ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే నటి హేమ కూడా నాగబాబును ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యానాలు చేసింది. నాగబాబు ‘మా’ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నప్పుడు 75 లక్షల ఖరీదుగల ఓ ఇల్లు కొన్నారని, ఇప్పుడు దాని ఖరీదు 15 లక్షలు మాత్రమేనని పేర్కొంది. అలాగే.. ఆయన ‘మా’ కోసం ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని, ఫండ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపణలు చేసింది. ఇదే విషయమై తాజాగా నాగబాబు సమాధానమిచ్చారు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. ‘నేను భూమి కొన్న విషయం నిజమే! కానీ.. అది నా సొంత ప్రయోజనాల కోసం తీసుకోలేదు. అప్పుడు నేను ఈ ల్యాండ్ తీసుకునే సమయంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, జనరల్ బాడీ మెంబర్స్ కూడా అంగీకారం తెలిపారు. అప్పుడు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అయినా.. రియల్ ఎస్టేట్ వ్యాపారరంగంలోకి దిగిన మురళీమోహన్.. ప్రస్తుత నేపథ్యంలో విలువ తగ్గుతున్న ధర విషయాలకు సంబంధించి వేరే కోణంలో ఆలోచిస్తే ఎలా?’ అంటూ ఆయన హేమ వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు.
అలాగే.. నటి హేమ గురించి మాట్లాడుతూ.. ‘హేమ అమాయకురాలు. ఆమె కేవలం మురళీమోహన్ ఆలోచనలతో మాత్రమే నాపై విమర్శలు చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మురళీ చేతిలో ఆమె ఒక కీలుబొమ్మ మాత్రమే! నేను ఎవరిమీదైనా కామెండ్ చేయాలనుకుంటే.. అది కేవలం మురళీమోహన్ మాత్రమే చేస్తాను’ అంటూ ఆయన అన్నారు. అంతేకాదు.. మురళీ మోహనే ఈ ‘మా’ ఎన్నికల్లో రియల్ లైఫ్ పాలిటిక్స్ తెచ్చి, ఆటలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
‘మురళీ మోహన్ చాలాకాలం ‘మా’ అధ్యక్ష పదవిలో కొనసాగారు. కాబట్టి.. ఆయన్నే మనం ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో ప్రశ్నించాలి. రకరకాల వ్యాధులతో, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారిని ఆర్థికంగా సహకరించాల్సింది పోయి.. ఈ యజ్ఞాలు, హోమాలు ఎందుకు చేస్తున్నారు. అవి ఎవరికైనా ప్రయోజనం కలిగిస్తాయా..?’ అంటూ నాగబాబు ప్రశ్నించారు. మరి.. ప్రస్తుతం మాలో జరుగుతున్న వివాదాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా..? అన్న ప్రశ్నలకు ఆయన సింపుల్ సమాధానం చెప్పారు.
‘మా’ ఎన్నికలు ముగిసిన తర్వాత తాను, మురళీమోహన్ మళ్లీ షేక్ హ్యాండ్ చేస్తామని, ఆలింగనం కూడా చేసుకుంటామని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ ‘మా’ ఎన్నికలు పెద్ద యుద్ధమేమీ కాదని, పొలిటికల్ వార్ కూడా ఏమీ కాదని.. అయితే కొన్ని అవాంఛిత ఆటంకాలు మాత్రమే స్వల్ప వ్యవధి వరకు కొనసాగుతాయని ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more