ఆప్ లో ముదురుతున్న వివాదాలు అంతకంతకూ ముదురుతున్నాయి. అయితే శుక్రవారం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆప్ కీలక నేతలుగా మెలిగి, ప్రస్తుతం పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల విషయంలో ఏదో ఒక కీలక నిర్ణయం వెలుడే అవకాశం ఉంది. అయితే గత కొంత కాలంగా ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల తరఫున అరవింద్ కేజ్రీవాల్ తో సాగుతున్న చర్చలు విఫలమవుతూ వచ్చాయి. దాదాపుగా ఇద్దరు నేతలకూ పార్టీ నుండి వీడ్కోలు వస్తుందని ఇప్పటికే తేలిపోయింది. అయితే కొంత మంది ఆప్ నేతలు మాత్రం ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లకు మరో అవకాశాన్ని ఇవ్వాలని, వారి వాదనకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆప్ కమిటిని అడుగుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఆప్ కన్వీనర్ గా రెండు పదవులను అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కన్వీనర్ పదవికి రాజీనామా చెయ్యాలని పార్టీలో ఇద్దరు నేతలు మంటలు రేపారు. అయితే పార్టీలో అంతర్గతంగా ఉండాల్సిన విషయాలను లేఖల రూపంలో ఇరువురు నేతలు బహిర్గతం చెయ్యడం వివాదాస్పదంగా మారింది. అయితే ఎన్నికల సమయానికి ముందు నుండి ఇద్దరు నేతలు కేజ్రీవాల్ తో విభేదించారని ఆప్ బాంబు పేల్చింది. అయితే ఆప్ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ తనకు టైం ఇస్తే అన్ని విషయాలను చర్చిస్తానని ప్రశాంత్ భూషణ్ గతంలో ప్రకటించారు. కానీ బెంగళూరు నుండి తిరిగి వచ్చిన తరువాత కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పార్టీని ఏర్పాటు చెయ్యడం దగ్గరి నుండి అన్ని రకాలుగా పార్టీకి అండగా నిలిచిన ఇద్దరు కీలక నేతలను పార్టీ కీలక పదవుల నుండి తొలగించాలని గతంలో పార్టీ సభ్యులు నిర్ణయించారు. అయితే దానిపై కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ చర్చలకు సిద్దమని చెప్పినా, కేజ్రీవాల్ నుండి ఎలాంటి ప్రయత్నం లేకపోవడంతో కాస్త నిరుత్సాహంగా ఉన్నారు ప్రశాంత్ భూషణ్ వర్గం. కేజ్రీవాల్ కు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను సాగనంపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మరి కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, పొలిటికల్ ఎఫైర్స్ కమిటి లో తిరిగి వారికి చోటు దక్కే అవకాశం ఉందో లేదో శనివారం తేలిపోతుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పాటు, ల్యాండ్ బిల్ లాంటి కీలక అంశాలపై పార్టీ క్యాడర్ చర్చించనుంది. రానున్న ముంబాయి పై ఆప్ మరింత దృష్టి సారించాలని, ఆ దిశగా పావులు కదుపుతోంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more