జపాన్ మార్జాల ద్వీపం ప్రత్యేకత గురించి చెప్పే ముందు.. అసలు మార్జాల ద్వీపం అంటే ఏమిటో కూడా తెలియాలి కదా.. మార్జాలం అంటే పిల్లి.. ద్వీపం అంటే చుట్టూ నీరుతో నిండిన భూభాగం.. దానినే ఇంగ్లీషులో ఐలాండ్ అని కూడా అంటారు. మరి పెంపుడు జంతువులైన పిల్లులకు ఒక ద్వీపం వుందంటే నమ్ముతారా..? మరో విషయం చెప్పాలంటే ఆ ద్వీపంలో మనుషుల కన్నా పిల్లుల సంఖ్యే అధికంగా వుందంటే విశ్వసిస్తారా..? కానీ ఇది నిజం. జపాన్ లోని ఓషిమా ద్వీపాంలో మనుషుల కంటే పిల్లుల సంఖ్యే అధికం. మరోలా చెప్పాలంటే మనుషుల కంటే ఆరు రెట్లు పిల్లులు వుంటాయి. వినడానికే విచిత్రంగా వున్న ఈ ద్వీపం పిల్లుల ప్రేమికులకు సర్గధామం. అందుకే ధీనిని పిల్లుల ద్వీపం అని కూడా పిలుస్తుంటారు.
ఇంతకీ ఇక్కడ ఇన్ని పిల్లులు ఎలా వచ్చాయన్న దానిపై కూడా కొన్ని కథలు ప్రచూర్యంలో వున్నాయి. రెండవ ప్రపంచ యుద్దం తరువాత పలువురు పింఛను తీసుకుంటున్న ఆర్మీ అధికారులు ఏకాంతంగా జీవితాన్ని గడపడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అయితే ఇక్కడ ఎలుకలు అధిక సంఖ్యలో వుండి వారిని ఇబ్బందులు పెట్టడంతో వాటిని వేటాడే పనికోసం కొన్ని పిల్లులను తెచ్చారు. ఎలుకలు రమారమి సంహరణకు గురికాగా, పిల్లులు వాటి సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయని కథలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 120కి చేరుకోగా మనుషులు మాత్రం కేవలం 20 మంది మాత్రమే ఇక్కడ నివాసం వుంటున్నారు.
పిల్లుల ప్రేమికులకు ఇది సర్గధామమే అయినప్పటికీ ఇది పర్యటక కేంద్రం మాత్రం కాదని, అందుకని పెద్ద సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు ఎవర్వూ రారని జపాన్ వాసులు చెబుతున్నారు. హెలో కిట్టీ అన్న పేరుతో పిల్లుల కార్టూన్లు, వాటి బోమ్మలతో అనేక పిల్లల వస్తువులు తయారు చేసే సంస్థ ఉద్భవించిన జపాన్ లో పిల్లుల కోసం ప్రత్యేక ద్వీపం వుండటంలో అతిశయోక్తి ఏముందని పలువురు మార్జాల ప్రేమికులు వ్యాఖ్యానిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more