భారీ మెజార్టీతో గెలిచిన మోదీ ప్రభుత్వానికి అనుకోని అడ్డుతగిలింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపట్ల ప్రతిపక్షాలు కళ్లాలువేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే బిల్లులో సవరణలు చెయ్యాలన్న విపక్షాల మాటనెగ్గింది. ఓటింగ్ లేకుండా చూడాలనుకున్న ప్రభుత్వానికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షాల సవరణ కోరుతూ ఓటింగ్కు పట్టుబట్టాయి. ధన్యవాద తీర్మానానికి సవరణలు ప్రతిపాదించి, విపక్షం విజయం సాధించడం దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఇది నాలుగోసారి కావడం గమనార్హం. నల్లధనాన్ని వెనక్కి తెప్పించడం గురించికానీ, ఉన్నతస్థాయిలో అవినీతిని నియంత్రించడం గురించి కానీ రాష్ట్రపతి ప్రసంగంలో సవరణను సీపీఎం సభ్యులు ఏచూరి సీతారాం, పి.రాజీవ్ ప్రతిపాదించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంలో నల్లధనం అంశం ఉందని, ఈ సవరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. సీతారాం ఏచూరిని ఒప్పించేందుకు ప్రయత్నించారు.
ఎంతకీ విపక్షాలు మెట్టు దిగకపోవడంతో ఓటింగ్ అనివార్యం అయింది. కాగా రాజ్యసభలో మెజార్టీలేని ప్రభుత్వం ఓటింగ్ లో ఓడిపోయింది. సభాధ్యక్షుడు అన్సారీ ఈ సవరణ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో విపక్ష తీర్మానానికి అనుకూలంగా 118 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 57 ఓట్లు మాత్రమే వచ్చాయి. సీపీఎం తీర్మానానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడంతో ఈ విజయం సాధ్యమైంది. మొత్తాని మోదీ సర్కారు రాజ్యసభలో చాలా బలహీనంగా ఉందనే విషయం రుజువైంది. అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణల బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాల్సిన సమయంలోఇలాంటి పరిణామాలు మోదీ సర్కార్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more