ఎపియస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ, ఎప్పుడూ నష్టాల కడలిలో కొట్టుకుంటూ ఉండే పెద్ద సంస్థ. 75 సంవత్సరాల చరిత్రలొ ఆర్టీసీ తొలిసారిగా ఎన్నడూ లేని కొత్త రికార్డును సాధించింది. రికార్డ్ అంటే కొంపదీసి లాభాలు అనుకునేరు..నష్టాలే..అవి కూడా భారీ నష్టాలు. 2013-14 సంవత్సరానికిగాను 902 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది ఆర్టీసి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారులు ఫిబ్రవరి నెల వరకూ రూపొందించిన ఆదాయ-వ్యయాల పట్టికను రూపొందించారు. దానిని పరిశీలించి ఈ పదకొండు నెలల్లోనే ఆర్టీసీ 931.77 కోట్ల నష్టపోయింది. ఈ లెక్కన ఈసారి నష్టాలు 1,100 కోట్లను చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాల్లో సింహభాగం ఆంధ్ర ప్రదేశ్ నుంచే వచ్చింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రం నుంచి 573.56 కోట్లు, తెలంగాణ పరిధిలో 358.21 కోట్లుగా నష్టం వచ్చినట్లుగా తేలింది.
ఆర్టీసీ ఎప్పుడూ నష్టాల బాటలో నడుస్తున్నా, ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి ప్రయత్నాలను చెయ్యలేదు. నష్టాలను తగ్గించేందకు ఎలాంటి నివారణ చర్యలను తీసుకోలేదు. ప్రతిసారి ఓ కమిటిని వెయ్యడం, నివేదిక తీసుకోవడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇప్పుడు విభజన అనంతరం ఏర్పడిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడిగా కొనసాగుతున్న ఆర్టీసీలో సంస్కరణల జోలికి వెళ్లకపోవడంతో నష్టాలు భారీగా పెరిగాయి. ఇరు ప్రభుత్వాలు కూడా కేవలం మొక్కుబడిగా అధికారులను వివరాలు అడగడం తప్ప సమీక్షలు నిర్వహించడం లేదు. దీంతో ఆర్టీసీ నష్టాలు పెరుగుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటున్నప్పటికీ నష్టాలు రావడానికి కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. విభజన నేపథ్యంలో అంతర్గతంగా అధికారుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలతో వారెవరూ పరిస్థితిని పట్టించుకోవటానికి ముందుకు రావటం లేదు. ఆర్టీసీ విభజనకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నందున.. దిద్దుబాటు చర్యలకు అవకాశం కనిపించడం లేదు.
-అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more