కరడుగట్టిన మతోన్మాదులు, రక్తం తాగే మానవమృగాలు, రక్తపిపాసులు ఇలా ఎంత చెప్పినా తక్కువే వారి గురించి. ప్రపంచానికి రక్తపు మరకలు అంటిస్తున్న ఐఎస్ఐఎస్ తాజాగా ట్విట్టర్ పై యుద్దానికి సిద్దపడింది. నిన్నటి దాకా మనుషుల రక్తాన్ని కళ్ల చూసిన తీవ్రవాదులు ఇప్పుడు సోషల్ మీడియాపై పడ్డారు. తమ నెట్ వర్క్ ను ప్రపంచం మొత్తం వ్యాపింపజేసిన ఈ సంస్థ, ఫేస్ బుక్,ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సహాయంతో కొత్త వారిని తమ సంస్థలోకి చేర్చుకుంటోంది. ఇలా చాలా మంది ఈ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులుగా మారి, ఉగ్రవాదులుగా మారుతున్నారు. నిఘా వర్గాల హెచ్చరిక మేరకు అనుమానాస్పద అకౌంట్లను క్లోజ్ చేసింది ట్విట్టర్.
నిన్నటి దాకా సోషల్ మీడియా ద్వారా తమ నెట్ వర్క్ ను నడిపిన ఐఎస్ఐఎస్..ట్విట్టర్ వైఖరితో ఖంగుతింది. ట్విట్టర్ లో తమ అకౌంట్లను క్లోజ్ చెయ్యడంపై ఉగ్రవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ స్థాపకుడు జాక్ డోర్సీ కి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు పోస్ట్ చేశారు. తమ పై యుద్దానికి దిగడం అంటే స్వతహాగా యుద్దం చేసుకున్నట్లేనని, ట్విట్టర్ ను స్థాపించిన వారిని, అందులో పని చేసే వారికి ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. తమ వారు సింహాల్లా పంజా విసిరితే, కనీసం చూడడానికి కూడా ఉండరని, తిరిగి రాని లోకాలు వెళతారు అంటూ వారు తీవ్రంగా హెచ్చరించారు.
మరో పక్క ఉగ్రవాదులు ట్విట్టర్ పై యుద్దానికి దిగడం కలకలం రేపింది. అనుమానం ఉన్న దాదాపు 2 వేల ట్విట్టర్ ఖాతాలను మూసివెయ్యడం పై అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అసలు ఉగ్రవాదులు ఎక్కడి నుండి తమ పోస్ట్ లను పంపుతున్నారు, ఎలా పంపుతున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ట్విట్టర్ కార్యాలయాల వద్ద, ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more