ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ లో లుకలుకలు మొదలయ్యాయి. ఆప్ సిద్దాంతాలకు భిన్నంగా జోడు పదవుల్లో కొనసాగుతున్న వారికి వ్యతిరేకంగా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా పార్టీ వ్యవస్థాపకుల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లు పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తు వారు లేఖలు కూడా రాశారు. అయితే ఆప్ లో మొదలైన ఈ గొడవ కాస్తా, చిలిచిలికి గాలివానగా మారింది. మీడియా ఆప్ వ్యవహారంపై కథనాలను ప్రసారం చెయ్యడం, అభిమానులు కూడా పార్టీ గురించి చర్చించడం మొదలైంది.
మొత్తం వ్యవహారంపై ఇప్పటి దాకా పెదవి విప్పని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రజలు ఎంతో నమ్మకంతో తమను అధికారంలో కూర్చోబెట్టారని, వారికి సుపరిపాలన అందించడం తమ ముందున్న లక్ష్యమని ట్వీట్ చేశారు. ఆప్ లో జరుగుతున్న వివాదాలపై తాను ఘాడంగా కలత చెందినట్లు అరవింద్ తెలిపారు. అయితే అసలు తను ఏం చెయ్యబోతున్నాడో మాత్రం కేజ్రీవాల్ చెప్పకపోవడం గమనార్హం.
ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించడం దగ్గరి నుండి, అధికారంలోకి తీసుకు రావడం వరకు అన్నింటిలో ముందున్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం విశేషం. పార్టీ సిద్దాంతాలు, రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలన్న బలమైన సంకల్పంతో ప్రారంభమైన పార్టీ ఇలా వివాదాలతో వార్తకెక్కింది. అయితే పార్టీలో జరుగుతున్న వివాదాలపై రేపు జరగనున్న ఆప్ సమావేశంలో అన్నీ పరిష్కారమవుతాయని కొందరు భావిస్తున్నారు. అసలు పరిష్కారమవుతాయో, కొత్త వివాదాలకు బీజం పడుతుందో రేపటి్కి గానీ తేలదు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more