క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డుల మోత మోగించి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. ఒక్క విషయంలో మాత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే చాలా దారుణమైన స్థితిలో వున్నారని తెలిసింది. అసలు ఒక క్రికెటర్ కి, పొలిటికల్ లీడర్ కి లింకేంటి..? అని అనుకుంటున్నారా..? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
వివరాల్లోకి వెళ్తే.. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే! బడ్జెట్ సమావేశాలు జరగడానికి రెండురోజుల ముందే రాహుల్ హాలిడే ట్రిప్ కి వెళ్లిపోయారు. ఆయన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా అదొక సంచలనంగా మారింది. అత్యవసరమైన బడ్జెట్ సెషన్ సమయంలో రాహుల్ హాలిడేకి వెళ్లడమేంటని ప్రశ్నల మీద ప్రశ్నలను లేవనెత్తేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఇప్పటికీ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతూనే వున్నాయి. రాహుల్ పై కుళ్లుజోకులు, సెటైర్లు, కామెడీ బొమ్మలు వంటివి ఎన్నో దర్శనమిస్తున్నాయి.
ఇప్పటికే దారుణమైన పరిస్థితిలో వున్న కాంగ్రెస్ కి ఇప్పుడు రాహుల్ ట్రిప్ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో జరుగుతున్న డ్యామేజీని కొంతవరకైనా తగ్గించుకునే పనిలో పడింది కాంగ్రెస్! అదేమిటంటే.. పార్లమెంటులో వున్న ఎంపీలందరూ ఇప్పటివరకు ఎంత శాతం హాజరయ్యారనే విషయాన్ని లేవనెత్తి, తమ నాయకుడ్ని కాపాడుకునే పనిలో పడింది. రాహుల్ గాంధీ కంటే ఇతర ఎంపీలు మరింత దారుణంగా హాజరయ్యారంటూ కాంగ్రెస్ లెక్కలు తేల్చి చెబుతోంది. ఈ హాజరు లెక్కల్లో చాలా దారుణంగా వున్న ఎంపీలు చాలామందే వున్నారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరు శాతం అయితే అత్యంత ఘోరంగా వుందని తేలింది.
పార్లమెంటులో రాహుల్ గాంధీ హాజరు ఇప్పటివరకు 65 శాతం వుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే.. ఆయనకంటే 120 మంది ఎంపీల హాజరు మాత్రం అత్యంత దారుణంగా వుందని పార్టీ వెల్లడించింది. లోక్ సభలో శిబుసోరెన్, దీపక్ అధికారి, పన్వర్ లాల ల హాజరు 5 శాతం కంటే తక్కువగా వుందని తెలిపింది. అలాగే రాజ్యసభకు 5 శాతం కంటే తక్కువగా హాజరైన వారిలో సచిన్, సినీ నటి రేఖలు వున్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అంటే రాహుల్ హాజరు 65 శాతం కాగా, సచిన్ హాజరు 5 శాతం కంటే తక్కువగా వుంది. ఈ విషయంలో సచిన్ కంటే రాహుల్ గాంధీయే బెటర్ అనిపించుకున్నాడన్నమాట!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more