శాసన మండలి చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అదృశ్యం అవుతోంది. ఇప్పుడు తెలంగాణ శాసన మండలిలో టిడిపి సభ్యులు ఒక్కరూ ఉండని పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం శాసన మండలిలో టిడిపి సభ్యుడు ఒకే ఒక్కరు. టిడిపి సభ్యునిగా ఉన్న అరికెల నర్సారెడ్డి పదవీ కాలం ఈనెల 31తో ముగుస్తుంది. ఏప్రిల్ ఒకటి నుంచి టిడిపి తరఫున మండలిలో ప్రాతినిధ్యం వహించే వారే ఉండరు. తెలుగుదేశం నుంచి మండలిలో ప్రాతినిధ్యం వహించేవారు నలుగురు ఉంటే వారిలో ముగ్గురు టిఆర్ఎస్లో చేరారు. మిగిలిన ఏకైక సభ్యుడు నర్సారెడ్డి పదవీ కాలం 31తో ముగుస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సభ్యులు వస్తారు. వీరిని శాసన సభ్యులు ఎన్నుకొంటారు. ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా మండలిలో కొత్తగా టిఆర్ఎస్ తరఫున ఏడుగురు సభ్యులు, గవర్నర్ నామినెటెడ్ సభ్యుడు ఒకరు మొత్తం అధికార పక్షం తరఫున ఎనిమిది మంది వస్తారు. 17మంది ఓట్లకు ఒక ఎమ్మెల్సీ ఎన్నికవుతారు. టిడిపి తరఫున అసెంబ్లీకి గెలిచిందే 15 మంది. ఒకవేళ ఈ పదిహేను మంది ఎమ్మెల్యేలు అలానే టిడిపిలో ఉన్నా వారి సంఖ్య ద్వారా ఎమ్మెల్సీ సీటు దక్కదు. గెలిచిన 15 మందిలో ముగ్గురు ఇప్పటికే టిఆర్ఎస్లో చేరారు. మరో ముగ్గురు టిఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శాసన మండలి సభ్యుల ఎన్నికకు ముందే వాళ్లు టిఆర్ఎస్లోకి రానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. రెండు గ్రాడ్యుయేట్ నియోజక వర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో టిడిపి పోటీనే చేయలేదు. టిఆర్ఎస్ బిజెపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. దీంతో గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి కూడా శాసన మండలిలోకి ప్రవేశించే అవకాశం లేదు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాసన మండలిని రద్దు చేశారు. 2004లో టిడిపి ఓడిపోయి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మండలిని పునరుద్ధరించారు. టిడిపి తిరిగి అధికారంలోకి వస్తే మండలిని రద్దు చేస్తామని చంద్రబాబు తొలుత ప్రకటించినా, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసెత్తలేదు. బహుశా అప్పుడు గనక చంద్రబాబు శాసన మండలిని రద్దు చేసి ఉంటే, ఇప్పుడు టిడిపి ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా అని కొందరు టిడిపి సీనియర్లు అనుకుంటున్నారు. మొత్తానికి మొదటిసారిగా టిడిపి శాసనమండలిలో ఒక్క సభ్యుడిని కూడా కల్గి ఉండకపోవడం చరిత్రలో మిగులనుంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more