టిపిసిసి అధ్యక్ష పదవిపై వివాదం మొదలైంది. పొన్నాల లక్ష్మయ్యను తప్పించి ఆ స్థానంలో ఉత్తమ్కుమార్ రెడ్డిని నియమించాలన్న ఎఐసిసి నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొన్నాల అనుకూల, వ్యతిరేకవర్గాలు, ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. సిఎల్పి నాయకునిగా ఉన్న కె. జానారెడ్డి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన ఉత్తమ్ను టి.పిసిసి అధ్యక్షునిగా ఎలా నియమిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. పైగా ఇరువురూ ఒకే లోక్సభ నియోజకవర్గం పరిథిలోని ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతేకాకుండా ఉత్తమ్ను సొంత జిల్లాలోని ఆయన సామాజికవర్గానికి చెందిన కొంత మంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు. జానారెడ్డితో పాటు ఎంపి కోమటిరెడ్డి బ్రదర్స్ తదితరులు ఉత్తమ్ను వ్యతిరేకిస్తుండగా, ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి మాత్రం ఇంత అర్జంటుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని అంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు పొన్నాలను మొదటి నుంచి విమర్శిస్తున్న ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఉత్తమ్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. సిఎల్పి నేతగా జానారెడ్డి ఉన్న తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ను టి.పిసిసి అధ్యక్షునిగా ఎలా నియమిస్తారని, పైగా వెనుకబడిన కులానికి చెందిన పొన్నాలను అంత అర్జంటుగా తప్పించాల్సిన అవసరం ఏముందని పార్టీలో కొందరు ప్రశ్నిస్తున్నారు.
సాధారణ ఎన్నికలకు వంద రోజుల ముందు పొన్నాలకు టి.పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించారని, దేశ వ్యాప్తంగా పార్టీ ఓటమి చెందినప్పుడు తెలంగాణలో మాత్రం అద్భుతాలు ఎలా సృష్టిస్తారని కొందరు అనుకుంటున్నారు. అధ్యక్షుడ్ని మార్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు పార్టీని అధికార పీఠంపైకి ఎక్కించలేరు కదా? అని పార్టీలో చర్చ జరుగుతోంది. మరో వైపు కుల పోరు కూడా ఇందుకు తోడవుతోంది. పొన్నాలను తప్పించినా, తిరిగి బిసికే ఆ పదవి ఇవ్వాలి తప్ప, ఉత్తమ్కు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయంపై కొందరు బిసివర్గం నేతలు మండిపడుతున్నారు. ఒకవేళ ఉత్తమ్కు టి.పిసిసి పగ్గాలు అప్పగిస్తే, సిఎల్పి నేత పదవిని ఎస్సిలైన జె. గీతారెడ్డి లేదా మల్లు భట్టివిక్రమార్కకు ఇవ్వాలని డిమాండ్ ప్రారంభమైంది. అలాకాని పక్షంలో మరో ఏడాది వరకు పొన్నాలనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పొన్నాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు, అనుకూలంగా ఉన్న నాయకులు ఢిల్లీలో మకాం వేశారు.మొత్తానికి పొన్నాల వ్యవహారం కొత్త చర్చకు దారి తీసింది. అధిష్టానం నుండి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more