Bethampudi janesena stages protest

bethampudi villagers, bethampudi janasena protest, janasena party news, bethampudi villagers stages protest, bethampudi agaist land pulling, pawan kalyan news, bethampudi villagers on janasena, bethampudi villagers on pawan kalyan, pawan kalyan janasena news

Bethampudi janesena stages protest against land pulling in guntur capital area.

ఆందోళనకు పిలుపునిచ్చిన జనసేనపార్టీ

Posted: 02/26/2015 09:22 PM IST
Bethampudi janesena stages protest

రావయ్య, ఇక మా పక్షాన నిలవయ్య, మా గోంతు నీవ్వు కావయ్య, మాకు అన్యాయం జరుగుతుంది నిలదీయవయ్యా అంటూ గుంటూరు జిల్లా ప్రజలు దీనంగా ఆర్తనాథాలు పెడుతున్నారు. తమ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో లాగేసుకుంటున్నారని, ఇప్పటికైనా వాటిని నిలువరింపచేయాలని వారు వేడుకుంటున్నారు. ఇంతకీ.. ఎవరిని వేడుకుంటున్నారో తెలుసా..? అన్యాయం జరిగిన ప్రతిచోటా తానుంటానని, బాధితుల తరఫున తన గళం వినిపిస్తానని.. పార్టీ ఆవిర్భావ సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్! మరోలా చెప్పాలంటే జనగళం వినిపించేందుకు పార్టీని స్థాపించిన జనసేన అధ్యక్షుడు!

ఇప్పుడు ఆయనే తమకు చివరి ఆశ, శ్వాస అంటున్నారు గుంటూరుజిల్లా రాజధాని ప్రాంతరైతులు. గుంటూరు జిల్లాలోని బేతంపూడి గ్రామంలో జనసేన పార్టీ పేరుతో వారు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మల్లెతోటలున్న ప్రాంతాలను రాజధాని ప్రాంతం నుంచి మినహాయించాలని వారు వేడుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పక్షాన ప్రభుత్వాన్ని ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా గళం వినిపించాలని కోరారు. తొలిసారిగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ పేరుతో ఆందోళన జరగనుంది. రేపు బేతంపూడి గ్రామస్థులు ల్యాండ్ పూలింగ్ ను నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమవైపే వుంటారని గ్రామస్థులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయన రైతుల ధర్నాపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే!


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bethampudi villagers  janasena  protest  

Other Articles