సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, దారుణాలను పూర్తిగా ఎండగడతామంటూ సొంత డప్పు వాయించుకుంటున్న ఆప్, బీజేపీ పార్టీలు వాటన్నింటికీ కేరాఫ్ అడ్రస్’గా నిలుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు న్యాయం జరిగేలా హామీ ఇస్తామంటూ చెప్పుకుంటున్న ఆయా పార్టీలే గతంలో సామాన్య ప్రజలపై నేరాలకు పాల్పడిన అభ్యర్థులకు సీట్లు ఇచ్చేశాయి. ‘క్రైమ్’ అనే పదాన్ని తుడిచిపెట్టేస్తామంటూ వాగ్దానాలు చేస్తున్న పార్టీలే నేరచరిత గల అభ్యర్థులనే ప్రజల ముందు మంత్రులుగా నిలబెట్టిస్తున్నారు. అంటే.. పార్టీ గెలుపొందాలనే స్వార్థం కోసం అంగ, అర్థ బలాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నమాట! మరి.. ఇక్కడ న్యాయపోరాటం ఎక్కడుంది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీలు నేరచరిత కలిగిన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చాయి. రాజకీయ ప్రక్షాళన చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆప్ పార్టీ టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 23 మంది పలు క్రిమినల్ కేసుల్లో ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నవారే వున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. తామూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా ఆప్ పార్టీ కంటే ఇంకా ఎక్కువ నేరచరితగల అభ్యర్థులకే టికెట్లు పంచిపెట్టింది. బీజేపీ టికెట్లు ఇచ్చిన మొత్తం అభ్యర్థుల్లో 29 మంది క్రిమినల్ కేసుల్లో మొగ్గుతున్నవారే! ఇక కాంగ్రెస్ టికెట్లు ఇచ్చినవారిలో 21 మందికి నేరచరిత వుంది. ఇదీ.. రాజకీయ పార్టీల అసలు బాగోతం! ఇంకో విషయం ఏమిటంటే.. ఢీల్లీ ఎన్నికల్లో మొత్తం 673 మంది నామినేషన్లు వేయగా.. అందులో 17 శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు వున్నట్లు తేలింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more