గతంలో NTV న్యూస్ ఛానెల్’లో రాత్రి 11.30 గంటలకు ప్రసారమయ్యే ‘సినీకలర్స్’ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించే పాటల్లో అసభ్యత, అశ్లలత వుంటోందంటూ కేంద్రానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు ఆ కార్యక్రమ డీవీడీలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిశీలించింది. ఇలా పరీశీలించిన అనంతరం కేంద్రం దీనిపై స్పందిస్తూ.. వీక్షకులకు అనుగుణంగా ఈ కార్యక్రమం లేదని, అందులో అశ్లీలత, అసభ్యత చాలా ఎక్కువగా వుంటోందని తేల్చి చెప్పింది. ఈ విధంగా ప్రసారం చేయడం కేబుల్ టీవీ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఎన్టీవీ ప్రసారాలను ఓ వారం రోజుల (ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు)పాటు నిషేధిస్తున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ నీతి సర్కార్ గతనెలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
అయితే.. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రచన టెలివిజన్ లిమిటెడ్ (ఎన్టీవీ) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రప్రభుత్వం గతనెల 19న జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆ సంస్థ డైరెక్టర్ టి.రమాదేవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు. 2012లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రసారమైన ఈ కార్యక్రమంపై రాతపూర్వకంగా ఇదివరకే వివరణ ఇచ్చామని డైరెక్టర్ పేర్కొన్నారు. ఆ ప్రొగ్రామ్’ని తాము 2012లోనే నిలిపివేశామని, దానికి సంబంధించి ఇప్పుడు నిషేధం విధించడం సరికాదని అన్నారు.
రెండున్నరేళ్ల క్రితమే నిలిపివేసిన కార్యక్రామానికి సంబంధించి ఇప్పుడు నిషేధం విధించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎన్టీవీ సంస్థ డైరెక్టర్ టి.రమాదేవి తమ పిటిషన్’లో పేర్కొన్నారు. అసలు ప్రసారాలపై నిషేధం విధించే అధికారం కేంద్రసమాచార, ప్రసారమంత్రిత్వశాఖ డైరెక్టర్’కు లేదని తెలిపిన ఆమె.. ఆ నిషేధం ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యహారంపై విచారణ జరిపిన అనంతరం కోర్టు తీర్పు వెలువడాల్సి వుంటుంద. మరి.. దీనిపై కోర్టు స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more