దక్షిణాప్రికాలోని చమురు ఉత్పత్తి దేశాలలో అగ్రభాగాన నిలిచిన లిబియాలో మళ్లీ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. లిబియా చమురుపై అధిపత్యం కోసం పోరాడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లిబియా రాజధాని ట్రిపోలిలో విధ్వంస రచనకు తెగబడ్డారు. అక్కడున్న ప్రముఖ హోటల్ లోకి చోరబడి అందులోని అతిధులను బంధీలుగా తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భారత్ కాలమాన ప్రకారం ఇవాళ రెండున్నర గంటల ప్రాంతంలో లిబియా రాజధాని నగరం ట్రిపోలిలోని పాత నగరంలోని ప్రముఖ కొరింత్యా హోటల్ వద్ద ఉగ్రవాదులు కారు బాంబును పేల్చారు.
ఆ తరువాత వెంటనే సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు హోటల్ లోకి ప్రేవేశించారు. వారి రాకను అడ్డుకోబోయిన ముగ్గురు గార్డులను కాల్చి చంపి హోటల్ లోకి ప్రవేశించారు. సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు బులెట్ ఫ్రూఫ్ జాకెట్లను ధరించి, గాలిలోకి కాల్పులు జరుపుతూ.. హోటల్ లోని అతిధిలను బంధీలుగా చేసుకున్నారు. అయితే హోటల్ వర్గాల సమాచారం ప్రకారం హోటల్ లో సుమారు 90 శాతం గదులు ఖాళీగా వున్నాయని సమాచారం. కానీ కొంత మంది వ్యాపార్థస్థులు, దౌత్యవేత్తలు మాత్రం ఉన్నారని చెప్పారు. కాగా ఉగ్రవాదులు ఎంత మంది ఏ ఏ దేశం వారిని బందీలుగా తీసుకున్నారన్న వివరాలు తెలియాల్సి వుంది.
ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. 1998లో అమెరికా రాయబారిపై బాంబుదాడులకు యత్నించిన కేసులో నేరస్థుడిగా నిర్ధారణ అయిన అనాస్ అల్ లిబి అనే లిబియాకు చెందిన నేరస్థుడు ఇటీవల ట్రయల్ కొనసాగుతుండగానే మరణించాడు. అతని మరణానికి ప్రతికార చర్యగానే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఈ దాడులకు తెగబడినట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతుంది. ఈ బాంబు దాడులలో వందలాది మంది టాంజానియా, కెన్యా వాసులు మరణించారు. కాగా ఈ దాడులకు తెగబడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తేల్చిచెబుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more