భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విచ్చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఒబామా, మోదీ మధ్య కొన్ని రహస్య ఒప్పందాలు జరిగాయి. తమ మధ్య జరిగిన రహస్య కార్యకలాపాలను గోప్యంగా వుంటేనే మంచిదని మోదీ పేర్కొన్నారు కూడా! ఏదైతేనేం.. ఒబామా రాకతో దేశంలో గణతంత్ర ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే.. ఒబామా రాకను జీర్ణించుకోలేకపోయిన చైనా ప్రభుత్వం.. భారత్’కు ఓ హెచ్చరికను జారీ చేసింది.
‘రిపబ్లిక్ డే’ సందర్భంగా చైనా భారత్’కు ఓ సందేశాన్ని అందజేసింది. అమెరికా, దాని మిత్రదేశాలు పన్నిన వలలో చిక్కుకోవద్దని చైనా సూచించింది. ఒబామా వ్యూహాత్మక రచనలతో దెబ్బతీసే అవకాశముందని, వాళ్లు వేసిన వలలో ఎట్టిపరిస్థితుల్లోనూ పడొద్దని, ముందుగా ఆలోచనలు - చర్చలు జరిపిన మేరకే అమెరికాతో ఒప్పందం కుదుర్చోవలసిందిగా ఆయన సలహాలు ఇచ్చారు. అలాగే.. భారత్’తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తేందుకు తాము సిద్ధంగా వున్నామని చైనా స్నేహహస్తం చాచింది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సందేశమిస్తూ.. భారత్’తో కలిసి శాంతిని పెంపొందించే దిశగా ప్రయత్నాలకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా.. బీజింగ్’కు వ్యతిరేకంగా న్యూఢిల్లీని ఉసిగొల్పేందుకు అమెరికా కుతంత్రాలకు, కుట్రాలకు పాల్పడుతోందంటూ గ్లోబల్ టైమ్స్, పీపుల్స్ డైలీ పత్రికల్లో ఓ వ్యాసం కూడా ప్రచురితమైంది. ఇప్పుడు ఆయన నేరుగా భారత్’కు అమెరికాతో జాగ్రత్తగా వుండాలంటూ సందేశం పంపించారు. ఈ విధంగా అమెరికాపై వ్యతిరేకంగా చైనా ప్రచారం చేయడం పెద్ద వివాదానికే దారితీస్తుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more