భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ఒబామా సంయుక్తంగా పాల్గొన్న మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు నమస్తే..! మేరా ప్యారా భారత్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ చాయ్పే చర్చలో తనను ఆహ్వానించినందుకు సంతోషంగా వుందన్నారు. రెండు దేశాలు ప్రజల సాధికారతకు పాటు పాడాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్, అమెరికా స్నేహసంబంధాల్లో కొత్త శకం ప్రారంభమయిందని ఒబామా అన్నారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉక్రెయిన్లో సైనికజోక్యం వుండదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.
రష్యా బలహీనపడటం లేక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం వంటి అంశాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. యెమెన్లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టంచేశారు. పరిశుభ్రమైన ఇంధనం కోసం కృషి చేస్తామన్నారు, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ ఒప్పందాలను మరో 10 ఏళ్లు పొడిగిస్తామని ఆయన చెప్పారు. భారత ప్రజలతో రేడియోలో నేరుగా మాట్లాడుతానని ఒబామా తెలిపారు. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన మొదటి అధ్యక్షుడిని నేనే. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అణు విస్తరణ విషయంలో కూడా రెండు దేశాల మధ్య బంధం బలోపేతమైంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నామన్నారు. ఇండియాతో మరింత హైటెక్ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం ఉంటుందని తెలిపారు. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయన్నారు.
భారత్- అమెరికాల మధ్య సంబంధాల్లో నవశకం ప్రారంభమయిందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఒబామాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ముందుగా మాట్లాడుతూ ఒప్పందం కుదిరిన ఆరుసంవత్సరాలకు మరింత ముందుకు పోవడం హర్షణీయమన్నారు. రక్షణ ప్రాజెక్టుల్లో కూడా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాల్సివుందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం వుందన్నారు. ప్రతి దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపాలని కోరారు. పరిశుభ్రమైన ఇంధన వనరుల కోసం అమెరికా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల మధ్య ఆర్థికసంబంధాలు మరింత పటిష్టం కావాల్సిన అవసరం వుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం వుందన్నారు. తరచుగా ఒబామాతో ఫోన్లో మాట్లాడటంతో పాటు సరదా సంభాషణలు కూడా చేస్తామని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లినప్పుడు తనను ఒక బాలీవుడ్ నటుడికి స్వాగతం పలికిన రీతిలో స్వాగతించారని మోదీ వెల్లడించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more