అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ అవే ఫలితాలు పునరావృతం కానున్నాయి. ఒక చోట కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వనుండగా, మరో చోట హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం సీ ఓటర్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో తేలింది. ఐదు దశల్లో జరిగిన జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27-33 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ 32-38 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీ 4-10 స్థానాలతోను, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 8-14 స్థానాలతోను సరిపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంటే.. ఈసారి అధికార మార్పిడి తథ్యమని తేల్చారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే కనీసం 44 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఈనెల 23వ తేదీ మంగళవారం ఉంటుంది. అదేరోజు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
దశల్లో ఎన్నికలు ముగిసిన జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా, రెండూ కమలానికే పట్టంగట్టాయి. ఏబీపీ నీల్సన్ సంస్థ నిర్వహించిన పోల్స్లో.. బీజేపీ 52, జేఎంఎం 10, కాంగ్రెస్ పార్టీ 9, జేవీఎం 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు.
ఇక ఇండియాటుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో అయితే బీజేపీ 41-49, జేఎంఎం 15-19, కాంగ్రెస్ 7-11, జీవీఎం 0, ఇతరులు 8-12 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. ప్రస్తుతం అక్కడ జేఎంఎం- కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more