Raghuveera reddy criticised the ruling tdp mla

criticised tdp government, apcc president raghuveera reddy, raghuveera reddy congress, raghuveera reddy criticised tdp mla, TDP Government, criticised the Telugu Desam government, hudhud relief fund, hudhud corruption

Congress Leader Raghu Veera Reddy Fires on TDP Government over Hudhud relief fund

హుదూద్ డబ్బూ నోక్కేశారంటా....!!

Posted: 12/20/2014 09:14 AM IST
Raghuveera reddy criticised the ruling tdp mla

ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆయన రైతు రుణమాఫీ పై చంద్ర బాబు పై అనేక విమర్శలు చేస్తూ... రుణమాఫీ పేరు చెప్పి అధికారం లోకి వచ్చి రైతుల్;అను మోసగించారని ఎన్నో సార్లు ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ విషయం చంద్ర బాబు అనేక సభలలో కొందరికి డబ్బులిచ్చి ఆయనకు ఆయనే పోగిడించుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఆ విషయమా లోనే ప్వ్యవసయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ నెంబర్ రైతులందరికీ ఇచ్చి ఎవరికైనా రుణమాఫీ విషయం లో ఏ సమస్య వచ్చిన వెంటనే మంత్రి కి కాల్ చేయాలని ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. దాంతో వ్యవసాయ మంత్రి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

తాజాగా ఎపి ప్రభుత్వంపై, టిడిపి ఎమ్మెల్యేలపై ఆయన మరో కొత్త ఆరోపణ చేశారు. హుదూద్ తుపాను సహాయ కార్యక్రమాలలో అధికార టీడీపీ నాయకులు దారుణమైన అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.తుపాను బాధితుల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారని, అయితే ఇందులో రూ. 150 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలే తినేశారని ఆయన ఆరోపించారు. దీనిపై జనవరి మొదటివారంలో తమ పార్టీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశామని ఆయన తెలిపారు.దీనిపై రెండు, మూడు రోజుల్లో గవర్నర్ కలుస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. మేము న్యాయస్థానం లో పిటిషన్ వేసిన తర్వాత ఎవేరెంత నోక్కేశారో తెలుస్తుంది అన్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles