గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ధనిక గ్రామంగా ఈ గ్రామాం చరిత్ర సృష్టిస్తోంది. అంతేకాదు నూరు శాతం అక్షరాస్యతతో గ్రామం మరో రికార్డును కూడా సాధించింది. దేశంలో 90 వేల కోట్ల రూపాయల ప్రవాస భారతీయుల డిపాజిట్లతో కేరళ రాష్ట్రం ముందంజలో వుండగా, గుజరాత్ లో ఒక్క చిన్న గ్రామమే వెయ్యి కోట్ల డిపాజిట్లను సాధించడం మరో విశేషం. వడోదరకు 70 కిలోమీటర్ల దూరంలో.. ఆనంద్ జిల్లాలో వున్న ఈ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు చేసిన బ్యాంకింగ్ డిపాజిట్లతో అది అత్యంత ధనిక గ్రామంగా అవతరించింది.
కేవలం 11 వేల 333 మంది జనాభా వున్న ఈ గ్రామంలో 13 బ్యాంకులు వాటి శాఖలను ప్రారంభించి సేవలను అందిస్తున్నాయంటే.. ఆ గ్రామానికి వున్న విశిష్టత ఇట్టే అర్థమవుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఫోస్టాపీసు, బ్యాంకులలో ఈ గ్రామం నుంచి వెళ్లిన ప్రవాస భారతీయులు ఇక్కడ చేసిన డిపాజిట్ల మొత్తం 1000 కోట్లకు చేరుకుందని వడోదర డివిజన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. హిర్వే మీడియాకు వెల్లడించారు. ధర్మాజ్లో 3 వేల కుటుంబాలు ఉండగా ఆయా కుటుంబాల నుంచి కొందరు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. వారు తమ డిపాజిట్లను స్వగ్రామంలో బ్యాంకుల్లో చేయడంతో ధర్మాజ్ ఆర్థికంగా అందరినీ ఆకట్టుకునేలా మారింది. దీంతో గ్రామంలో నిరక్షరాస్యత అనేది మచ్చకు కూడా కనబడకుండా చేస్తోంది. గ్రామంలో 3000 కుటుంబాలు నివాసం వుండగా, వాటిలో సుమారు 1700 కుటుంబాలకు చెందిన సభ్యులు బ్రిటెన్ లో స్థిరపడగా, 300 మంది అమెరికాలో 150 మంది న్యూజీలాండ్ లో, 200 మంది కెనడాలో, 60 మంది అస్ట్రేలియాలో స్థిపడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more