ఇటీవల దక్షిణ భారత దేశంలో సంచలనం సృష్టించిన 11 ఏళ్ళ బాలిక అత్యాచారం కేసులో ఒక 15 ఏళ్ళ పిల్లాడే నిందితుడటా..! వేలూరులో ఆరో తరగతి విద్యార్థిని కీర్తిక (బాదితురాలు) చదువుతున్న పాటశాలలోనే ఆ అబ్బాయి 10 వ తరగతి చదువుతుండటం గమనార్హం... పోలీస్ ల కథనం ప్రకారం అసలేమి జరిగిందంటే....
వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ రెండో కుమార్తె కీర్తిక మాచనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అదే పాటశాలలో పడవ తరగతి చదువుతున్న శరణ్రాజ్ కొద్ది రోజులుగా కీర్తికపై కోరికతో పరిచయం పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న కీర్తిక వద్ద శరణ్రాజ్ తాను ఇంటికి వెళుతున్నానని ఇద్దరూ కలిసి వెళదామని చెప్పాడు. అనంతరం పాఠశాల ముందున్న మహిళ వద్ద జామ పండు తీసి ఇచ్చాడు. జామ పండు తింటూ కీర్తిక శరణ్రాజ్తో కలిసి ఇంటికి బయల్దేరింది. ఇంటికి వెళ్లే దారిలోని మామిడి తోటలో కాసేపు ఆటలాడుకుని వెళదామని శరణ్రాజ్ తెలిపాడు. మామిడి తోటలోకి కీర్తిక వెళ్లడంతో కాళ్లు, చేతులు కట్టి ఆటలాడుతామని శరణ్రాజ్ తెలపడంతో ఇవేమీ తెలియని తెలియని కీర్తిక తన రిబ్బన్, దుప్పట్టా (చున్నీ) ఇచ్చింది. దీంతో కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తన మనసులో ఉన్న మాటను చెప్పాడు. ఇందుకు కీర్తిక అంగీకరించక పోవడంతోపాటు కేకలు వేయడంతో ఆగ్రహించిన శరణ్రాజ్ కీర్తిక నోటికి చున్నీని కట్టేసి, బట్టలు ఊడదీశాడు.
పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కీర్తికను లొంగదీసుకునేందుకు శరణ్రాజ్ వల్ల కాలేదు. అయితే ఇంటికి వెళ్లి విషయాన్ని చెపుతుందని అనుకున్న నిందితుడు పక్కనున్న మద్యం బాటిళ్లతో కీర్తిక తలపై కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కీర్తిక గుండెపై బాటిల్తో కోసి బయటకు తీసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. వెంటనే కీర్తిక మృతి చెందిన విషయాన్ని గమనించిన శరణ్రాజ్ మృత దేహాన్ని ముళ్ల చెట్ల వద్ద వేసి ఇంటికి వెళ్లిపోయాడు. రక్తపు మరకతో వచ్చిన శరణ్రాజ్ను చూసిన తల్లిదండ్రులు ఏమి జరిగిందని విచారించకుండా బంధువుల ఊరికి పంపించేశారు. అయితే ఈ హత్యలో శరణ్రాజ్కు సాయం మరెవరో సాయం అందించినట్లు పోలీసులకు అనుమానం వచ్చి మరో పదో తరగతి విద్యార్థిని పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఒక 11 ఏళ్ళ బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడటంతో ప్రజలంతా విస్మయం చెందుతున్నారు. ఇలా భయంకరమైన రీతిలో పిల్లలు పెడదోవ పట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అబ్బురపరిచే చెడు అలవాట్లే ఈ పెడార్థలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more