రంగు రుచి చిక్కదనం వుంటేనే కమ్మనైన టీ అని ఎలా అంటామో.. అదే తరహాలో కులం, మతం, ప్రాంతం లాంటి ఏ అడ్డుంకులు లేకుండా చేసేదే మోసం, ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. దేశంకాని దేశంలో ఘరానా మోసానికి తెరలేపారు ఆ ఘరానా మోసగాళ్లు. నలుగురు క్విన్స్ దేశీయులతో ఇద్దరు బ్రూక్లిన్ దేశస్థులు ఒక్క బ్రాన్క్స్ దేశీయుడు కలసినా ఏమైనా జరిగేదేమో.. అయితే వీరికి జతగా ముగ్గురు పాకిస్థానీయులు కూడా కలిసే సరికి..అదో ఘరాణ మోసగాళ్ల కోఠారిలా తయరైంది. అంతే పాకిస్థానీయులు మోసానికి ప్రణాళిక రచించారు. మిగతావారంతా వారు చెప్పినట్లుగా నడుచుకున్నారు. భారత్ అంటే నిలువెల్లా విషం నింపుకున్న పాకిస్థానీయులు టార్గెట్ మీకు అర్థమయ్యిందనుకుంటా.
అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ ను కేంద్రంగా చేసుకుని ఈ పది మంది కలసి విదేశాల నుంచి భారత్ కు వెళ్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని పది లక్షల రూపాయల మేర మోసానికి తెరలేపారు. అగ్రరాజ్యం నుంచి భారత్ కు చేరుకునే సుమారు 200 మంది ప్రయాణికులను మోసగించి సోమ్ముచేసుకున్నారు. బాంబే ట్రావెల్స్ అండ్ టూర్స్, రాజ్ ట్రావెల్స్, గాంధీ ట్రావెల్స్, పటేల్ ట్రావెల్స్, మహా గురు ట్రావెల్స్ వంటి ప్రైవేటు దిగ్గజ ట్రావెల్స్ యానామాన్యాలతో తమకు టై అప్ వుందని చెప్పి నకిలీ పాస్ పోర్టులు, లైసెన్సులతో ఆయా ట్రావెల్స్ పేరుతో బ్యాంకులలో ఖాతాలను తెరచారు. తమకు వివిధ ట్రావెల్స్ లో టై అప్ వుందని, మిగతా ఎయిర్ లైన్స్ కన్నా తక్కువ ధరలోనే తాము టిక్కెట్లను అందిస్తామని పేర్కొంటూ భారత అమెరీకన్ పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించారు. అయితే రాయితీలో టిక్కెట్ లభిస్తుందని ఆశపడిన ప్రయాణికులు వీరి వద్ద టిక్కెట్ కొనుగోలు చేశారు. నేరుగా తమ క్రెడిట్ కార్డులతో బ్యాంకులోకి డబ్బులు జమ అవ్వడం, ప్రయాణికులు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను సూచించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కాగా, నిందితులు బ్యాంకులలో జమ అయిన డబ్బులను తీసుకుని తమ జేబుల్లో నింపుకున్నారు.
తీరా ప్రయాణానికంటూ విమానాశ్రాయలకు చేరుకున్న ప్రయాణికులను అధికారులు అడ్డుకుని విషయాన్ని తెలిపారు. తమ వద్ద వున్నవి నకిలీ టిక్కెట్లని తెలియడంతో ప్రయాణికులు తీవ్ర మనోవేధనకు గురయ్యారు. వీరి మోసానికి గురైన వారిలో ఓ గర్భవతి తమ బంధువుల వివాహ వేడుకను హాజరుకాకుండా చేసిందని, క్యాన్సర్ తో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు వెళ్తున్న ఓ కోడుకును ప్రయాణాన్ని అడ్డుకుంది. జూన్ 2012 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు సాగిన వీరి అక్రమాలపై పిర్యాదులు అందడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్ కు వచ్చే పర్యాటకులను బూరడి కొట్టించి సుమారు పది లక్షలకు పైగా స్వాహా చేసిన ఘరాణా మొసగాళ్లలో క్వీన్స్ దేశానికి చెందిన జుబైర్ ధార్ (49); సర్ఫాజ్ ఖాన్ (51), జాన్ డో, మన్ జీత్ సింగ్ (40)లతో పాటు పాకిస్థాన్ కు చెందిన సుమిత్ ఛావ్లా (42), షా నవాజ్ ఖైనీ (29), బ్రోక్లైన్ కి చెందిన రాణా ముహమ్మద్ తరిఖ్ (32), చౌదరీ మహ్మమద్ ఆరిఫ్(56)లతో పాటు బ్రాక్స్ దేశానికి చెందిన సదఖత్ అలి (48)లు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణలో వుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more